Amritpal Singh : అమృత్ పాల్ సింగ్.. మన దేశంలోని పంజాబ్ కేంద్రంగా ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కరుడుగట్టిన టెర్రరిస్ట్. ప్రస్తుతం ఈ ఉగ్రవాది అసోంలోని దిబ్రూగడ్ జైలులో ఉన్నాడు. టెర్రరిస్ట్ అమృత్ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జైలు నుంచే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. పంజాబ్లోని ఖదూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి స్వత్రంత్య అభ్యర్థిగా అమృత్ పాల్ పోటీ చేయనున్నాడు. త్వరలోనే అతడు నామినేషన్ కూడా దాఖలు చేస్తాడని తెలుస్తోంది. ఖదూర్ సాహిబ్ సెగ్మెంట్లో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఈవివరాలను స్వయంగా అమృత్ పాల్ తరఫు న్యాయవాది రాజ్ దేవ్ సింగ్ ఖల్సా మీడియాకు వెల్లడించారు. అమృత్ పాల్ను తాను బుధవారం రోజు జైలులో కలిసినప్పుడు ఈవివరాలు చెప్పారని పేర్కొన్నారు.
STORY | Radical preacher Amritpal Singh to fight Lok Sabha polls, claims lawyer; father refuses to comment
READ: https://t.co/BcMMLzWBvF
VIDEO:#LSPolls2024WithPTI #LokSabhaElections2024 pic.twitter.com/ZKMXnzx6gd
— Press Trust of India (@PTI_News) April 24, 2024
We’re now on WhatsApp. Click to Join
ఈ అంశంపై అమృత్ పాల్ సింగ్ తండ్రి టార్సెమ్ సింగ్ స్పందిస్తూ.. ‘‘అమృత్ పాల్ను నేను చాలా కాలంగా కలవలేదు. ఎన్నికల్లో అతడు పోటీ చేస్తున్న విషయం నాకు తెలియదు. అమృత్ పాల్ను(Amritpal Singh) కలిశాక.. అతడిని తెలుసుకొని మీకు చెబుతా’’ అని స్పష్టం చేశారు. గతేడాది అమృత్ పాల్ సింగ్, అతడి మద్దతు దారులు కత్తులు, తుపాకులతో అమృత్సర్ నగర శివార్లలోని పోలీస్ స్టేషన్లోకి చొరబడి విధ్వంసానికి తెగబడ్డారు. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అప్పట్లో తమ సహచరుడు లవ్ ప్రీత్ సింగ్ను విడుదల చేయాలని అమృత్ పాల్ డిమాండ్ చేశాడు. ఈ పరిణామాల తర్వాత అమృత్ పాల్ మాయమయ్యాడు. చాలా రోజుల పాటు గాలించిన పోలీసులు.. చివరకు 2023 ఏప్రిల్ 23న పంజాబ్లోని మోగా జిల్లాలో అతడిని అరెస్టు చేశారు. అమృత్పాల్పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించారు. తన కుమారుడిని పంజాబ్ జైలుకు తరలించాలని అమృత్పాల్ సింగ్ తల్లి బల్వీందర్ కౌర్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్తో కౌర్ ర్యాలీ చేపట్టేందుకు యత్నించగా పోలీసులు అరెస్టు చేశారు.