Site icon HashtagU Telugu

Bomb threat in Delhi: ఢిల్లీలో బాంబు బెదిరింపులు.. మోదీ, ముఖేష్ అంబానీలకు 400 కోట్ల డిమాండ్

Bomb threat in Delhi

Bomb threat in Delhi

Bomb threat in Delhi: ఢిల్లీ ఎన్సీఆర్‌లోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. దేశ రాజధాని వ్యాప్తంగా మొత్తం 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఢిల్లీలోని సుమారు 100 స్కూళ్లను తాత్కాలికంగా మూసేశారు. స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయితే పాఠశాలలకు మాత్రమే కాదు దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖేష్ అంబానీకి గతంలో కూడా బాంబు బెదిరింపు ఇమెయిల్‌లు పంపారు. పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. ఢిల్లీ పాఠశాలలకు గతంలో కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చాయి.

ఈ ఏడాది ఫిబ్రవరి 12 ఢిల్లీలోని సాకేత్‌లోని పుష్ప్ విహార్ ప్రాంతంలో ఉన్న అమిటీ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఆ సమయంలో కూడా స్కూల్‌ను పేల్చేస్తామంటూ స్కూల్ యాజమాన్యానికి ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఫిబ్రవరి 2న ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఇందులో ప్రిన్సిపాల్‌కు మెయిల్ పంపగా, ఈ మెయిల్ ద్వారా స్కూల్‌పై బాంబు పేలుస్తానని బెదిరింపులు వచ్చాయి. గతేడాది ఏప్రిల్ 25న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధికారిక ఐడీకి బాంబు బెదిరింపుతో కూడిన ఇమెయిల్ వచ్చింది. 2023 ఏప్రిల్ 12న డిఫెన్స్ కాలనీలో ఉన్న ఇండియన్ స్కూల్‌కి ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఆ తర్వాత ముందుజాగ్రత్తగా పాఠశాలను ఖాళీ చేయించారు. అయితే బాంబు బెదిరింపులు రావడంతో కమాండోలు, బాంబు డిస్పోజల్ స్క్వాడ్ పాఠశాలకు చేరుకుని పరిశీలించారు. కానీ ఇక్కడ అలాంటివేమీ కనిపించలేదు.

We’re now on WhatsAppClick to Join

2023 ఏప్రిల్ 25న, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపస్‌లో బాంబు అమర్చబడిందని, ఏప్రిల్ 26, బుధవారం ఉదయం 9 గంటలకు యాక్టివేట్ చేయబడుతుందని పేర్కొంటూ దాని అధికారిక ఐడికి ఇమెయిల్ వచ్చింది. తర్వాత పోలీసులకు అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. కాగా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తుంది. అక్టోబరు 7న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, నరేంద్ర మోదీ స్టేడియంను పేల్చివేస్తామని బెదిరిస్తూ ఒక ఇమెయిల్ వచ్చింది. ఈమెయిల్‌పై విచారణ సందర్భంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ ప్రోటాన్ మెయిల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి ఇమెయిల్ పంపినట్లు తేలింద. ఈ ప్లాట్‌ఫారమ్ యొక్క సర్వర్లు స్విట్జర్లాండ్‌లో ఉన్నాయి. రూ.500 కోట్లు కావాలని, లేకుంటే రేపు నరేంద్ర మోదీతో కలిసి నరేంద్ర మోదీ స్టేడియంను పేల్చివేస్తామని ఈమెయిల్ లో రాశారు. 2023 అక్టోబరు 27న ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ కంపెనీ అధికారిక ఇమెయిల్ కి మొదటి బెదిరింపు మెయిల్ వచ్చింది మరియు తనకు రూ. 20 కోట్లు అందకపోతే ముఖేష్ అంబానీని చంపేస్తానని బెదిరించారు. దీని తర్వాత అక్టోబర్ 28న మళ్లీ బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. కానీ ఈసారి నేరుగా రూ.200 కోట్లకు పెంచారు. మరియు తదుపరి పంపిన ఇమెయిల్‌లో ఈ మొత్తం రూ.400 కోట్లకు చేరుకుంది. ఈ కేసులో 21 ఏళ్ల నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు డార్క్ వెబ్‌ను ఉపయోగించి మెయిల్స్ పంపాడని తేలింది.

Also Read: Prabhas : ప్రభాస్ మంచివాడు కాదా.. నటి వరలక్ష్మి వైరల్ కామెంట్స్..

Exit mobile version