Bheema Koregao Case : వరవరరావుకు బెయిల్‌ మంజూరు

విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావుకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. భీమా కోరేగావ్ కేసులో ముంబై జైల్లో ఉన్న ఆయ‌న‌కు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది.

Published By: HashtagU Telugu Desk
Vara Vara Rao

Vara Vara Rao

విర‌సం నేత వ‌ర‌వ‌ర‌రావుకు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించింది. భీమా కోరేగావ్ కేసులో ముంబై జైల్లో ఉన్న ఆయ‌న‌కు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే, ముందస్తు అనుమతి లేకుండా గ్రేటర్ ముంబైలోని ట్రయల్ కోర్టు ప్రాదేశిక పరిధిని విడిచిపెట్టకూడదని ష‌ర‌తు విధించింది.జస్టిస్ U.U నేతృత్వంలోని లలిత్ బెంచ్… బెయిల్ మంజూరు చేయడానికి కేసు యొక్క వాస్తవిక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వ‌ర‌వ‌ర‌రావు వయస్సు (82) మరియు అతని ఆరోగ్య‌ప‌రిస్ధితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న శ్రీ వ‌ర‌వ‌ర‌రావు ఆరోగ్య కారణాల రీత్యా రెగ్యులర్ బెయిల్ కోసం ప్రయత్నించారు.”బెయిల్‌పై ఉన్నప్పుడు అతను తన స్వేచ్ఛను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు… కొంతమంది వారి తొంభైలలో మారథాన్‌లలో పరుగెత్తవచ్చు. కొంతమంది ఎనభై మరియు తొంభైలలో ఆరోగ్యంగా ఉంటారు, కొందరు కాదు.. అని బెంచ్ వ్యాఖ్యానించింది. ఈ కేసులో శ్రీ వ‌ర‌వ‌ర రావును ఆగస్టు 2018లో కస్టడీలోకి తీసుకున్నారని, వాస్తవానికి ఫిబ్రవరి 2021లో ఆయనకు మంజూరైనా.. పరిమిత మధ్యంతర బెయిల్‌ను పక్కన పెట్టి రెండున్నరేళ్లు కస్టడీలో ఉంచార‌ని సుప్రీం కోర్టు పేర్కొంది.

  Last Updated: 10 Aug 2022, 02:34 PM IST