Site icon HashtagU Telugu

Electoral Bonds : ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ లెక్కపై ఎస్‌బీఐ కీలక ప్రకటన

Electoral Bonds

Electoral Bonds

Electoral Bonds : 2019 సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 15 వ‌ర‌కు 22,217 ఎల‌క్టోర‌ల్ బాండ్ల‌ను జారీ చేశామని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ప్రకటించింది. వీటిలో 22,030 ఎలక్టోరల్ బాండ్ల‌ను రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్నాయని వెల్ల‌డించింది. ఎన్నిక‌ల బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో.. ఇవాళ ఎస్బీఐ అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. అందులోనే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల లెక్కలను ప్రస్తావించింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘాని(ఈసీ)కి కూడా బాండ్ల‌పై డేటాను స‌మ‌ర్పించిన‌ట్లు కోర్టుకు ఎస్బీఐ తెలిపింది.  ఈసీకి పెన్‌డ్రైవ్‌లో ఆ స‌మాచారాన్ని చేర‌వేసిన‌ట్లు పేర్కొంది. రెండు పీడీఎఫ్ ఫైళ్ల రూపంలో పాస్‌వ‌ర్డ్ ప్రొటెక్ష‌న్‌తో రాజకీయపార్టీల విరాళాల వివరాలన్నీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన‌ట్లు ఎస్బీఐ తెలిపింది.  ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు తేదీ, కొనుగోలుదారుల పేర్లు, విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీ పేర్లు ఈసీకి సమర్పించినట్లు వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

రాజకీయ పార్టీలకు రూ.16వేల కోట్లు ?

ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) జారీ ద్వారా వివిధ రాజకీయ పార్టీలకు దాదాపు 16వేల కోట్ల రూపాయల విరాళాలు సమకూరాయి. విరాళాల్లో అత్యధికంగా 80 శాతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే వచ్చినట్లు తెలుస్తోంది. దేశంలోని పరిశ్రమలు, కంపెనీలకు సంబంధించిన విధివిధానాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర సర్కారుకే ఉంటుంది. అందుకే కేంద్ర సర్కారును నడుపుతున్న బీజేపీకి ఇంతగా విరాళాలు వచ్చాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

Also Read : Group 1 Mains : 2018 గ్రూప్‌-1 మెయిన్స్​ రద్దు.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

Also Read : Biden Vs Trump : మరోసారి బైడెన్ వర్సెస్ ట్రంప్.. అమెరికా అధ్యక్ష అభ్యర్థులు వారే