Modi Sand Art: ఇసుకతో మోడీ శిల్పం.. అభిమానం చాటుకున్న రూపేష్ సింగ్

మూడోసారి ఎన్డీయే అధికారం చేపడుతున్న వేళ ప్రముఖ చిత్రకారుడు రూపేష్ సింగ్ మోడీపై అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో ఎందరో ప్రముఖులను ఇసుకతో బొమ్మ చేసి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. కాగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను ఇసుకతో తయారు చేశాడు

Published By: HashtagU Telugu Desk
Modi Sand Art

Modi Sand Art

Modi Sand Art: మూడోసారి ఎన్డీయే అధికారం చేపడుతున్న వేళ ప్రముఖ చిత్రకారుడు రూపేష్ సింగ్ మోడీపై అభిమానాన్ని చాటుకున్నాడు. గతంలో ఎందరో ప్రముఖులను ఇసుకతో బొమ్మ చేసి తన అభిమానాన్ని ప్రదర్శించాడు. కాగా తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ బొమ్మను ఇసుకతో తయారు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన చిత్రాలు వైరల్ గా మారాయి. రూపేష్ సింగ్ తన చేతులతో ఈ బొమ్మను రూపొందించాడు. దానిపై వెల్‌కమ్ బ్యాక్ మోడీ గవర్నమెంట్ 3.0 అని రాశాడు.

రూపేష్ సింగ్ చేసిన ఈ బొమ్మ చూపరులను అమితంగా ఆకట్టుకుంటుంద. రూపేష్ తన కళ ద్వారా ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రయత్నించారు.ఈ విషయమై రూపేష్ సింగ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. మూడోసారి ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు మరియు కాశీ ఎంపీ మోడీ జీ యొక్క ఇసుక బొమ్మను తయారు చేయడం ద్వారా సంతోష పడుతున్నాను అని చెప్పాడు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీయే 292 స్థానాల్లో గెలుపొందగా, భారత కూటమి 234 స్థానాల్లో విజయపతాకం ఎగురవేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో ఏర్పాటవుతున్న ఈ ప్రభుత్వం కార్యకలాపాలపై అందరి దృష్టి ఉంటుంది. తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించిన రెండో ప్రధాని నరేంద్ర మోదీ.

Also Read: Ramoji Rao Died : ఏపీలో 2 రోజులు సంతాప దినాలు

  Last Updated: 08 Jun 2024, 05:08 PM IST