Drugs : నడిరోడ్డుపై ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న ఓ రిక్షా డ్రైవర్

దేశ రాజధాని ఢిల్లీ లోని నడిరోడ్డు ఫై ఓ రిక్షా డ్రైవర్ ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది

  • Written By:
  • Publish Date - March 21, 2024 / 12:21 PM IST

దేశంలో డ్రగ్స్ (Drugs ) వాడకం బాగా పెరిగిపోయింది..ఓ పక్క పోలీసులు , ప్రభుత్వాలు డ్రగ్స్ ను అరికట్టాలని చేస్తున్నప్పటికి..యువత మాత్రం పెద్ద ఎత్తున డ్రగ్స్ బారిన పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ , ఢిల్లీ , ముంబై , బెంగుళూర్ వంటి ప్రధాన నగరాల్లో డ్రగ్స్ అనేవి విచ్చలవిడి అయ్యింది.

We’re now on WhatsApp. Click to Join.

మొన్నటి వరకు పబ్స్ లలో మాత్రమే డ్రగ్స్ ఎక్కువగా లబిస్తుండే కానీ ఇప్పుడు చిన్న చిన్న కిరాణా షాప్ ల్లో కూడా డ్రగ్స్ లభ్యం అవుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని నడిరోడ్డు ఫై ఓ రిక్షా డ్రైవర్ ఇంజెక్షన్‌తో డ్రగ్స్ ఎక్కించుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. దీని బట్టి అర్ధం చేసుకోవాలి డ్రగ్స్ కు యువతే కాదు పెద్ద వారు సైతం ఎంతగా అలవాటు పడ్డారో అర్ధం అవుతుంది.

Read Also : Pawan Campaign: మార్చి 27 నుంచి ప్రచార బరిలోకి పవన్