RBI Hikes Repo: EMIలు మ‌రింత భారం.. 4వ సారి రెపోరేటు పెంచిన ఆర్బీఐ

ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెంచింది.

  • Written By:
  • Publish Date - September 30, 2022 / 11:56 AM IST

ఊహించినట్లుగానే రెపోరేటును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెంచింది. బ్యాంకులకు ఇచ్చే నిధులపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటును 50 బేసిస్‌ పాయింట్లు పెంచి 5.9 శాతానికి చేర్చినట్లు ప్రకటించింది. ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. పరిశ్రమ వర్గాలు అంచనా వేసినట్లు కాకుండా ఆర్‌బీఐ మరింత అధికంగా పెంచేసింది. కొవిడ్‌ సంక్షోభం తర్వాత ఆర్‌బీఐ వరుసగా 4వ సారి రెపోరేటును పెంచింది.

భారాన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు వెంటనే బదలాయించ‌నున్నాయి. ఈ మార్పును ముందే అంచనా వేసిన కొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించేశాయి. దీంతో గృహ‌, కారు లోన్ సహా ఇతర రుణాల EMIలు మరింత భారం కానున్నాయి. ముందే చెప్పినట్లు ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకే రెపోరేటు పెంచుతున్నట్లు RBI గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు.

ద్రవ్య పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో 5.4 శాతం నుంచి 5.9 శాతానికి పెరిగింది. బ్యాంకుల‌కు ఆర్బీఐ ఇచ్చే వ‌డ్డీల‌ను రెపోరేటుగా పిలుస్తారు. రెపోరేటు పెంచ‌డం అంటే ఇక క‌మ‌ర్షియ‌ల్ బ్యాంకులు, లేదా వ్య‌క్తుల‌కు రుణాలు తీసుకోవ‌డం భారంగా మారుతుంది.