RBI Announces Mobile App: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కోసం డెడికేటెడ్ మొబైల్ అప్లికేషన్ను లాంచ్ చేస్తుంది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ యాప్ పెట్టుబడిదారులకు సజావుగా చెల్లింపులు చేయడంలో సహాయపడుతుంది.
ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ నవంబర్ 2021లో ప్రారంభించబడింది. ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది రిటైల్ పెట్టుబడిదారులకు మరింత సౌలభ్యంగా ఉండనుందని అంటున్నారు విశ్లేషకులు. వ్యక్తిగత రిటైల్ పెట్టుబడిదారులు ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ని ఉపయోగించి సెంట్రల్ బ్యాంక్తో సులభంగా రిటైల్ డైరెక్ట్ గిల్ట్ (RDG) ఖాతాను తెరవవచ్చు. నిజానికి ప్రభుత్వం పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు పలు పథకాలను ప్రవేశపెడుతోంది. రిటైల్ పెట్టుబడిదారులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలతో పాటు సావరీన్ గోల్డ్ బాండ్ల వంటి వాటివైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. రిటైల్ డైరెక్ట్ (RBI-RD) పథకం ద్వారా ప్రభుత్వ సెక్యూరిటీలలో రిటైల్ పెట్టుబడిదారులు ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల ద్వారా చెల్లింపులు చేయవచ్చు కాబట్టి యాప్ ఎలాంటి సమస్యలు లేకుండా లావాదేవీలను సులభతరం చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం ఇటీవల సాధారణ ప్రజలకు సంబంధించిన ఒక ముఖ్యమైన సలహాను జారీ చేసింది. ఈ సలహా DoT పేరుతో చేస్తున్న స్పూఫ్ కాల్లకు సంబంధించినది. ఈ కాలర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. వినియోగదారుల మొబైల్ నంబర్లు బ్యాంకులతో డిస్కనెక్ట్ చేయబడతాయని లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగించబడుతున్నాయని భయాందోళనలను సృష్టిస్తారు. సైబర్ క్రైమ్ మరియు ఆర్థిక మోసాలకు పాల్పడేందుకు వ్యక్తిగత సమాచారాన్ని పొందడమే ఈ కాల్ల వెనుక అసలు ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో పౌరులు అప్రమత్తంగా ఉండాలని మరియు ఈ మోసపూరిత కాలర్లతో ఎలాంటి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దని డిపార్ట్మెంట్ సూచించింది.
Also Read: Amala Paul : అమలాపాల్ సీమంతం వేడుక ఫోటోలు చూశారా..!