పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాలు కూడా గందరగోళంగా మారాయి. లోక్సభ తర్వాత ఇప్పుడు రాజ్యసభ కార్యకలాపాలు కూడా శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే.. ముందుగా దీని ప్రొసీడింగ్లను డిసెంబర్ 7 నుంచి డిసెంబర్ 29 వరకు ప్రారంభించాలని ప్రతిపాదించారు. పార్లమెంటు (Parliament) శీతాకాల సమావేశాల్లో లోక్సభలో 97 శాతం కార్యకలాపాలు జరిగాయి. శుక్రవారం లోక్సభలో పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన పని గురించి సమాచారం ఇస్తూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. డిసెంబర్ 7, 2022న ప్రారంభమైన ఈ సెషన్లో మొత్తం 13 సమావేశాలు 68 గంటల 42 నిమిషాల పాటు జరిగాయి. సెషన్లో హౌస్లో పని ఉత్పాదకత 97 శాతం ఉందని ఆయన తెలియజేశారు.
ప్రస్తుత సెషన్లో 9 ప్రభుత్వ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టగా మొత్తం 7 బిల్లులు ఆమోదం పొందాయని బిర్లా తెలిపారు. ఈ సెషన్లో సభ్యులు 374 అత్యవసర ప్రజా ప్రాముఖ్యత అంశాలను, రూల్ 377 కింద 298 అంశాలను సభలో లేవనెత్తారు. ఈ సమావేశంలో ప్రభుత్వ మంత్రులు 43 ప్రకటనలు చేశారని, 1811 పేపర్లను టేబుల్పై ఉంచారని లోక్సభ స్పీకర్ తెలిపారు.
Also Read: Pak drone: మరో పాక్ డ్రోన్ కలకలం.. కూల్చిన బీఎస్ఎఫ్ బలగాలు
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29 వరకు పార్లమెంట్ వింటర్ సెషన్ కొనసాగాల్సి ఉండగా.. ఈ నెల 23ననే సెషన్ను ముగించాలని బీఏసీలో డిసైడ్ చేశారు. ఈ నెల 7న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా చర్చకు పట్టుబట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. డిసెంబర్ 9న అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ చెలరేగడంతో అదే అంశంపై పార్లమెంట్ ఉభయసభలు దద్ధరిల్లాయి. ఘటనపై ప్రభుత్వం ఉభయసభల్లో ప్రకటనలు చేసి చేతులు దులుపుకోగా.. ప్రతిపక్షాలు మాత్రం సమగ్ర చర్చ జరగాలని పట్టుబట్టాయి. ప్రభుత్వం చర్చకు అంగీకరించకపోవడంతో నిత్యం రభస కొనసాగింది. చివరికి ఉభయసభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి.