‘ఒకే దేశం, ఒకే ఎన్నికల’ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇది సమయం, డబ్బు వనరులను ఆదా చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు ప్రచారం చేసేందుకు కోలయత్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. “ఒక దేశంలో ఒకే ఎన్నికలు జరగాలి. ఇది డబ్బు, వనరులను ఆదా చేస్తుంది” అని అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడిందని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించాం” అని రక్షణ మంత్రి అన్నారు.
ఈ నిర్ణయానికి మన దేశ ప్రజలు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు” అని అన్నారు. కాంగ్రెస్ దీనిని వ్యతిరేకిస్తూనే ఉంది. కానీ ప్రతిదానిని వ్యతిరేకించడం ఆ పార్టీకి అలవాటుగా మారింది. ఒకప్పుడు తీవ్రవాద ఘటనలు తరచూ చోటుచేసుకునేవని ఆయన అన్నారు. “ఇప్పుడు, భారతదేశం వైపు కళ్ళు ఎత్తడానికి ఎవరూ సాహసించరు. రామమందిర నిర్మాణ తేదీ గురించి కాంగ్రెస్ మమ్మల్ని ఎగతాళి చేసేది. ఇప్పుడు, మాకు కూడా రామమందిరం వచ్చింది” అన్నారాయన. కాంగ్రెస్ హయాంలో దేశం విదేశాల నుండి ఆయుధాలను కొనుగోలు చేయాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు దేశం ఆయుధాలను తయారు చేస్తోంది. ఇప్పుడు మేం సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు చేస్తాం. కానీ కాంగ్రెస్ మా ధైర్య చర్యల గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది” అని ఆయన అన్నారు.