Site icon HashtagU Telugu

Army Missiles Misfire: జైసల్మేర్‌లో మూడు ఆర్మీ మిస్సైళ్లు మిస్ ఫైర్.. విచారణకు ఆదేశం

Army Missiles Misfire

Resizeimagesize (1280 X 720) 11zon

రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాలోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో శుక్రవారం భారత సైన్యం కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలో మూడు ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులు మిస్ ఫైర్ (Army Missiles Misfire) కారణంగా జైసల్మేర్‌లోని వేర్వేరు ప్రదేశాలలో పడిపోయాయి. వీటిలో రెండు శకలాలు ఇప్పటి వరకు సైన్యానికి అందాయి. క్షిపణి శకలాల కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. దీని వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

క్షిపణుల శకలాలు ఎక్కడ దొరికాయి..?

వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. శుక్రవారం పోకరన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో సైన్యం కసరత్తు కొనసాగుతోంది. అదే సమయంలో భూమి నుంచి గగనతలంలోకి ప్రయోగించే మూడు క్షిపణులను ప్రయోగించగా మూడు మిస్సైల్స్ మిస్ ఫైర్ కారణంగా ఆకాశంలో పేలిపోయాయి. ఈ క్షిపణులు ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వెలుపల పడిపోయాయి. ఈ క్షిపణులలో ఒకదాని శకలాలు అజసర్ గ్రామ సమీపంలోని పొలంలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ వెలుపల కనుగొనబడ్డాయి. అదే సమయంలో రెండవ క్షిపణి శకలాలు సత్యయ్ గ్రామానికి దూరంగా నిర్జన ప్రాంతంలో కనుగొనబడ్డాయి. మిస్సైల్స్ మిస్ ఫైర్ కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.ఎందుకంటే ఈ క్షిపణుల శకలాలు నిర్జన ప్రాంతాల్లో పడిపోయాయి.మూడో క్షిపణి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోంది.

Also Read: Eric Garcetti: భారత్ లో అమెరికా కొత్త రాయబారిగా ఎరిక్ గార్సెట్టి..!

శుక్రవారం పిఎఫ్‌ఎఫ్‌ఆర్‌లో ఒక యూనిట్ ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు భూమి నుండి గగనతలానికి క్షిపణులు ప్రయోగించాయని, అది మిస్ ఫైర్ అయ్యిందని ఆర్మీ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ చెప్పారు. క్షిపణి ఎగురుతున్న సమయంలో క్షిపణిలో సురక్షితమైన పేలుడు సంభవించింది. ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని.. మిస్సైల్స్ మిస్ ఫైర్ కావడానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు క్షిపణుల శకలాలు లభించగా.. మూడో క్షిపణి శిథిలాల కోసం అన్వేషిస్తున్నారని పేర్కొన్నారు.

Exit mobile version