ఏఐసీసీ యాక్టింగ్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ యూపీఏ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఉంటారని బీహార్ కాంగ్రెస్ చీప్ మదన్ మోహన్ ఝూ సంచలన ప్రకటన చేశారు. ఇటీవల బీహార్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత విపక్షాల ప్రధాని అభ్యర్థిగా నితీష్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా ఝూ ప్రకటన చేయడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జెడి(యు) అధినేత నితీష్ కుమార్ బిజెపితో తెగతెంపులు చేసుకుని, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి), కాంగ్రెస్తో చేతులు కలిపి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల తర్వాత మదన్ మోహన్ ఝా కీలక ప్రకటన చేశారు. 2024 పార్లమెంటరీ ఎన్నికల్లో నితీష్ కుమార్ను విపక్షాల ప్రధాని అభ్యర్థిగా అంచనా వేయడానికి జనతాదళ్-యునైటెడ్ (జెడి(యు)) ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఝూ ముందుకొచ్చారు. రాహుల్ గాంధీ లేక ఆయన ఎవరిని ఎంపిక చేసుకుంటే వారినే పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఉంటారని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా అన్నారు.
నితీష్ కుమార్ ప్రతిపక్ష ముఖంగా కాంగ్రెస్కు ఆమోదయోగ్యంగా ఉంటారా అని విలేకరులతో అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ నితీష్ కుమార్ జీ కూడా ప్రధాని అభ్యర్థి అని చెప్పలేదు. మా ప్రధానమంత్రి అభ్యర్థి అని మేం చెప్పలేదు. “మా అభ్యర్థి మా నాయకుడు రాహుల్ గాంధీ లేదా అతను ఎవరిని నామినేట్ చేసినా మా పార్టీ మొత్తం ఆ వ్యక్తికి వెన్నుదన్నుగా నిలుస్తుంది” అని ఆయన అన్నారు.