Punjab: పంజాబీ భాష తెలిసినవారికే…ప్రభుత్వ ఉద్యోగాలు..పంజాబ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం..!!

పంజాబ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంజాబీ భాష మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగులకు అర్హులంటూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన చండీగడ్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 04:15 PM IST

పంజాబ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పంజాబీ భాష మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగులకు అర్హులంటూ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన చండీగడ్ లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గ్రూప్ సి, డి పోస్టులలో పంజాబీ భాషపై లోతైన పరిజ్ణానం ఉన్న అభ్యర్థులను మాత్రమే నియమించేలా చట్టంలో సవరణలను క్యాబినెట్ ఆమోదించింది.

ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షణ చండీగఢ్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పంజాబ్, పంజాబీ, పంజాబియత్ ల తత్వాన్ని మరింత బలోపేతం చేయడమే దీని లక్ష్యమన్నారు. ఈ ప్రకటన అనంతరం పంజాబ్ సివిల్ సర్వీసెస్, రూల్స్, 1994 పంజాబ్ స్టేట్ సర్వీసెస్ రూల్స్, 1963లోని రూల్ 17కి సవరణలను కేబినెట్ ఆమోదించింది. పంజాబీ భాషపై లోతైన పరిజ్ణానం ఉన్నవారిని మాత్రమే పంజాబ్ ప్రభుత్వంలో నియమిస్తారు.