Manipur: గత కొన్ని రోజుల నుండి మణిపూర్ జాతుల ఘర్షణతో రగులుతున్న విషయం తెలిసిందే. అయితే మణిపూర్లో శనివారం నుంచి ఫ్రీ మూమెంట్ అమలులోకి వచ్చింది.ఈ క్రమంలోనే తమకు ప్రత్యేక పరిపాలన నెరవేరే వరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేశారు. దీంతో కాంగ్పోక్పి జిల్లాలో పలు చోట్ల నిరసనలు జరిగాయి. కుకీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో భద్రతా దళాల రక్షణ మధ్య నడిపిన రవాణా బస్సులను నిరసకారులు అడ్డుకున్నారు. వాహనాలపైకి రాళ్ళు రువ్వారు. పలు చోట్ల రోడ్లను బ్లాక్ చేసేందుకు ప్రయత్నించారు. గో బ్యాక్ అని నినాదాలు చేశారు. ఈ సంఘటనల్లో కొందరు కుకీ మహిళలు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
భద్రతా దళాలు కుకీ నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించాయి. ఈ సందర్భంగా ఘర్షణలు జరిగాయి. పలు చోట్ల భద్రతా సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. కాగా, మణిపూర్లో ఏడాదిన్నరపైగా మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగాయి. వందలాది మంది మరణించారు. ఇళ్లు కోల్పోయిన వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కోసం భద్రతా దళాల రక్షణలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో సీఎం ఎన్ బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో మణిపూర్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.
కాగా, మణిపూర్లో, భద్రతా దళాలు మోహరించినప్పటికీ, నిరసనకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. కుకీలు, జనం మధ్య ఘర్షణలు జరిగినట్లు సమాచారం. మొదటి రోజు నిరసనలు నయం కాకుండా, ప్రభుత్వ దళాలు కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలు మరింత ఉద్రిక్తతను తీసుకుని వచ్చాయి, పోలీసులు ఆందోళనకారులకు వ్యతిరేకంగా నీరసం, ఆంక్షలు విధించగా, రోడ్లపై నిండి ఉన్న జనాన్ని మరింత భద్రతా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రభుత్వం, ఈ పరిస్థితిని తక్షణమే పరిష్కరించేందుకు చర్చలు ప్రారంభించేందుకు ప్రణాళికలు వేస్తున్నది. అయినప్పటికీ, స్థానికులు ఇంకా తమ నిరసనలను కొనసాగిస్తున్నారు, దీని ప్రభావం మరింత విస్తరించకుండా ప్రభుత్వం ముందుకు వచ్చే సూచనలు చేస్తోంది.