Site icon HashtagU Telugu

Awadh Ojha : ఆమ్‌ ఆద్మీ పార్టీ చేరిన ప్రముఖ విద్యావేత్త అవధ్‌ ఓజా

prominent educationist Awadh Ojha joined the Aam Aadmi Party

prominent educationist Awadh Ojha joined the Aam Aadmi Party

Awadh Ojha : దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా సోమవారం ఆమ్ ఆద్మీ పార్టీ చేరారు. పార్టీ అధినేత అర్వింద్‌ కేజ్రీవాల్ , సీనియర్‌ నాయకుడు మనీష్ సిసోడియా సమక్షంలో ఓఝా ఆప్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం అవధ్ ఓజా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో చేరడం ద్వారా విద్య కోసం పనిచేసేందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు కేజ్రీవాల్ మరియు మనీష్ సిసోడియాలకు ఓజా కృతజ్ఞతలు తెలిపారు.

విద్య అనేది కుటుంబం, సమాజం మరియు దేశం యొక్క ఆత్మ అయిన అటువంటి మాధ్యమం. ఈ రోజు నా రాజకీయ ఇన్నింగ్స్ ప్రారంభంలో నేను రాజకీయాలు, ఎడ్యుకేషన్‌లో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే కచ్చితంగా ఎడ్యుకేషన్‌నే ఎంచుకుంటాను అని ఓజా అన్నారు. రాజకీయాల్లో చేరడం ద్వారా విద్యాభివృద్ధి నా ఉత్తమ లక్ష్యం అని ఆయన అన్నారు. ఇక ఓజా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) పరీక్షలు రాసే అభ్యర్థులకు శిక్షణ ఇస్తుంటారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న ఎంతో మంది ఉద్యోగార్థులు పెద్దపెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు.  70 మంది సభ్యుల ఢిల్లీ శాసనసభకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే భారత ఎన్నికల సంఘం తేదీలను ఇంకా ప్రకటించలేదు.

కాగా, IAS అధికారి కావాలనే ఆకాంక్షతో ఉన్న అవధ్ ప్రతాప్ ఓజా యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు చరిత్ర బోధించే ప్రసిద్ధ విద్యావేత్త. అతను చిన్నతనం నుండి IAS అధికారి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఓజా ప్రతిష్టాత్మకమైన పరీక్షకు సిద్ధమై ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించాడు. కానీ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ఓజా, 40 జూలై 3, 1984న జన్మించాడు. ఉత్తరప్రదేశ్‌లోని గోండాకు చెందినవాడు..అతని తండ్రి శ్రీమతా ప్రసాద్ ఓజా గోండాలో పోస్ట్‌మాస్టర్‌గా పనిచేశారు. ఓజా తన ప్రారంభ విద్యను గోండాలో అభ్యసించాడు. తరువాత గోండాలోని ఫాతిమా ఇంటర్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.

Read Also: CM Revanth : తెలంగాణలో అధికారం చేపట్టిన ఏడాదిలో కాంగ్రెస్ చేపట్టిన విజయాలు