భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) తన రాజకీయ ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిని గుర్తుచేశారు. ఆయన 2001లో ఇదే రోజున మొదటిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు అని ట్విట్టర్ (X) ద్వారా వెల్లడించారు. ఆ సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, “నా తోటి భారతీయుల నిరంతర ఆశీర్వాదాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ప్రభుత్వ అధిపతిగా 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాను” అని పేర్కొన్నారు. తన ట్వీట్తో పాటు మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి ఫొటోలు కూడా షేర్ చేశారు. ఈ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ఆయన అనుచరులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు విస్తృతంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Vijay Devarakonda Accident : విజయ్ దేవరకొండకు ప్రమాదం.. రష్మిక వల్లేనని కామెంట్స్!
మోదీ 2001లో గుజరాత్ సీఎం పదవిని చేపట్టిన తర్వాత, రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపిన నేతగా గుర్తింపు పొందారు. భూకంపం వంటి విపత్తు తర్వాత గుజరాత్ను పునర్నిర్మించిన విధానం, పారిశ్రామిక అభివృద్ధికి చేసిన కృషి ఆయన నాయకత్వ ప్రతిభను చూపింది. గుజరాత్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగి, 2014లో దేశ ప్రధాని పదవిని చేపట్టారు. అప్పటి నుంచి దేశాన్ని ఆర్థిక, రక్షణ, సాంకేతిక, అంతర్జాతీయ రంగాల్లో ముందుకు తీసుకెళ్లడానికి మోదీ చేపట్టిన సంస్కరణలు ఆయనను జాతీయ స్థాయి నాయకుడిగా నిలబెట్టాయి.
ప్రస్తుతం మోదీ తన 25వ పాలన సంవత్సరంలోకి అడుగుపెడుతూ.. ఈ ప్రయాణాన్ని ప్రజల ఆశీర్వాదం, విశ్వాసం ఫలితంగా పేర్కొన్నారు. “ప్రజల జీవితాలను మెరుగుపరచడం, దేశ పురోగతికి తోడ్పడటం నా నిరంతర కర్తవ్యం” అని ట్వీట్లో తెలిపారు. ఆయన ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ నాయకుడి ఆత్మపరిశీలన మాత్రమే కాకుండా, ప్రజాసేవకు అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. మోదీ నాయకత్వంలో దేశం అనేక మార్పులను చూసిందని, రాబోయే సంవత్సరాల్లో ఆయన విజన్ భారత అభివృద్ధి దిశను మరింత వేగవంతం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.
2001 में आज ही के दिन मैंने पहली बार गुजरात के मुख्यमंत्री के रूप में शपथ ली थी। आज मैंने सरकार के मुखिया के रूप में ईश्वर रूपी जनता-जनार्दन की सेवा करने के अपने 25वें वर्ष में प्रवेश किया है। लोकतांत्रिक व्यवस्था में ये सिद्धि, मुझे भारत की जनता का बहुत बड़ा आशीर्वाद है।
इन… pic.twitter.com/ycSvdSKIox— Narendra Modi (@narendramodi) October 7, 2025
