Modi In Japan: టోక్యోలో జపాన్ పిల్లలతో ప్రధాని మోదీ హిందీ సంభాషణ.. వైర‌ల్ అవుతున్న వీడియో

క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్ర‌ధాని మోడీ జ‌పాన్ వెళ్లారు.

  • Written By:
  • Updated On - May 23, 2022 / 12:59 PM IST

క్వాడ్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ప్ర‌ధాని మోడీ జ‌పాన్ వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా జ‌పాన్ వెళ్లిన‌ ప్రధాని నరేంద్ర మోదీకి సోమవారం టోక్యోలోని ఓ హోటల్‌లో ప్రవాస భారతీయులతో పాటు జపాన్ పౌరులు స్వాగతం పలికారు. అక్క‌డి పిల్లలతో ప్రధాని మోదీ సంభాషించిన వీడియోలు విస్తృతంగా వైర‌ల్ అవుతున్నాయి. జపాన్‌కు చెందిన వారిలో ఒకరు ప్రధానితో హిందీలో మాట్లాడారు. ప్ర‌ధాని మోడీతో ఇంటరాక్ట్ అయిన పిల్లలు ఆయన ఆటోగ్రాఫ్ తీసుకునేందుకు ఉత్సాహంగా ఉన్నారు.

ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు “భారత్ మా కా షేర్ అంటూ నినాదాలు చేశారు. మే 23, సోమవారం నుంచి ప్రారంభమయ్యే తన రెండు రోజుల పర్యటనలో భాగంగా క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని టోక్యోలో ఉన్నారు. ఇది ప్రధాని మోదీకి వ్యక్తిగతంగా రెండోసారి క్వాడ్ సమ్మిట్. క్వాడ్ ప్రభావవంతమైన సమూహంలోని సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలను చర్చించడం లక్ష్యంగా పెట్టుకుంది.

తన రెండు రోజుల పర్యటనలో, ప్రధాని మోదీ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మరియు కొత్తగా ఎన్నికైన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌లతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని ముఖ్యమైన భద్రతా సమస్యలు క్వాడ్ సమ్మిట్‌లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సభ్యులందరూ తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వంపై ఆసక్తిని పంచుకుంటారు.