Site icon HashtagU Telugu

PM Modi : 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ

Problems can't be solved on battlefield: PM Modi in Poland

PM Modi will participate in the election campaign in Jammu kashmir on 14th

 

Jammu Kashmir Election 2024: జమ్మూ కాశ్మీర్ లో ఈ నెల 18 నుండి మూడు విడతలుగా అసెంబ్లీ ఎన్నికల జరుగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ ఈ నెల 14న జమ్ముకశ్మీర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2019లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా మోడీ పలు సభల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది.

2019లో ఆర్టికల్‌ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్‌ (Jammu and Kashmir) అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో ఐదు దశల్లో జరిగాయి. ఈసారి మూడు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ.. తొలిదశలో 24 అసెంబ్లీ స్థానాలకు, రెండు, మూడు దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

కాగా, రాబోయే ఎన్నికల కోసం ఈ ప్రాంతంలో బలమైన స్థాపన కోసం బీజేపీ పి తన ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు హోం మంత్రి అమిత్ షాల తర్వాత ప్రధానమంత్రి పర్యటిస్తున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం జమ్మూలో రాంబన్, బనిహాల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలలో ప్రసంగించనున్నారు. శుక్ర, శనివారాల్లో కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న హోంమంత్రి అమిత్ షా ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు.

శుక్రవారం అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసి ఈ ప్రాంత ప్రజలకు 25 వాగ్దానాలు చేశారు. పార్టీ చేసిన 25 వాగ్దానాలలో, మొదటిది ‘రాష్ట్రంలో ఉగ్రవాదం మరియు వేర్పాటువాదాన్ని తుడిచిపెట్టడం’, తరువాత మహిళల ఆర్థిక భద్రత మరియు స్వావలంబనకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు పెంపొందించడం వంటివి ఉన్నాయి.

Read Also: Actress Madhavi Latha : హోమ్ మంత్రి అనిత ఫై నటి మాధవీలత ఫైర్