Modi Gold Statue: బంగారంతో మోడీ విగ్రహం.. ప్రధానికి ప్రేమతో!

స్వర్ణకారుడు సందీప్ జైన్ బృందం మోదీ (PM Modi)  బంగారు ప్రతిమను తయారు చేశారు.

  • Written By:
  • Updated On - January 20, 2023 / 01:35 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పై ఉన్న అభిమానంతో గుజ‌రాత్‌లోని సూర‌త్‌కు చెందిన స్వర్ణకారుడు సందీప్ జైన్ బృందం.. మోదీ (PM Modi)  బంగారు ప్రతిమను తయారు చేశారు. గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం, దీనివెనుక ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన కృషిని పురస్కరించుకుని.. 156 గ్రాముల బరువున్న బంగారు విగ్రహాన్ని (Gold Statue) తయారు చేసిన‌ట్టు తెలిపారు. ఈ విగ్రహాన్ని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశామ‌న్నారు.

ఈ బంగారు విగ్రహాన్ని రూపొందించేందుకు 11 లక్షల రూపాయ‌లు ఖర్చు అయ్యాయని… దీనిని తయారు చేసేందుకు దాదాపు త‌మ బృందంలోని 20 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించారని సందీప్‌జైన్ పేర్కొన్నారు. గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Assembly elections) బీజేపీ గెలిచిన మ‌రుక్ష‌ణం మోదీ ప్ర‌తిమ‌ను త‌యారు చేసే పని ప్రారంభించిన‌ట్టు సందీప్ జైన్​ చెప్పారు. త్వ‌ర‌లోనే ప్ర‌ధానిని  (PM Modi) క‌లిసి దీనిని ఆయ‌న‌కు బ‌హూక‌రించ‌నున్న‌ట్టు వివ‌రించారు.

Also Read: Secunderabad Fire Accident: సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో ముగ్గరు సజీవ దహనం!