Site icon HashtagU Telugu

G20 Summit 2023: విశ్వ కళ్యాణానికి ఆసియాన్ దేశాలు ముందుండాలి : ప్రధాని మోదీ

PM Modi Birthday

Pm Modi Slams Congress' Karnataka Manifesto, Says They Vowed To Lock Those Who Chant 'jai Bajrang Bali'

ఢిల్లీలో జి20 సమ్మిట్ నేపథ్యంలో భారతదేశం  జి20 ప్రెసిడెన్సీగా వివిధ అంశాలను తన బ్లాగ్ లో చేసిన ప్రచురణను  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ లో ప్రస్తావించారు. మానవ-కేంద్రీకృత ప్రపంచీకరణను మరింతగా పెంచడానికి చేస్తున్న ప్రయత్నాన్ని ఇది ప్రతిబింబిస్తుంది ప్రధాన మంత్రి  పేర్కొన్నారు. మానవ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో సామూహిక స్ఫూర్తిని నిర్ధారించడానికి తాము ఎలా పనిచేశాము అనే అంశంపై వివిధ అంశాలను ఆయన ఉటంకించారు. విశ్వ కళ్యాణానికి ఆసియాన్ దేశాలు ముందుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

వసుధైవ కుటుంబకం అనే మంత్రం అన్ని దేశాలకు వర్తిస్తుందని, 21వ శతాబ్దం ఆసియా శతాబ్దం అని ఆయన పేర్కొన్నారు. ఇండోనేషియాలోని జకార్తాలో జరిగిన ఆసియాన్-భారత్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారత్-ఆసియాన్ భాగస్వామ్యం నాల్గవ దశాబ్దానికి చేరుకుందని, ఈ శిఖరాగ్ర సమావేశానికి సహ-అధ్యక్షుడు కావడం తనకు గర్వకారణమని అన్నారు.

సమ్మిట్‌ను నిర్వహించినందుకు ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోను ఆయన అభినందించారు. భారతదేశం యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఆసియాన్ కేంద్ర స్తంభమని, భారతదేశ ఇండో-పసిఫిక్ చొరవలో ఆసియాన్‌కు ముఖ్యమైన స్థానం ఉందని మోదీ అన్నారు. గ్లోబల్ సౌత్ సందేశాన్ని ఇంకా విస్తరించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

Also Read: Land Dwellers: కాళేశ్వ‌ర్యం ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు చెక్ ల పంపిణీ