H1B Visas : జీ7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. ఇద్దరు నేతలు దాదాపు అరగంట పాటు చర్చలు జరిపారు. భారత్ – అమెరికా దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై బైడెన్, మోడీ ఈసందర్భంగా డిస్కస్ చేశారు. హెచ్1 బీ వీసా(H1B Visas) కోటా పెంపు అంశాన్ని మోడీ ప్రస్తావించారు. గతంలో ఈ కోటాను పెంచుతామని అమెరికా ఇచ్చిన హామీని భారత ప్రధాని గుర్తు చేశారు. భారత్లో గ్రీన్ ఎనర్జీ, రక్షణ రంగ పరికరాలు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాల గురించి బైడెన్కు మోడీ వివరించారు.
వ్యూహాత్మక భాగస్వామ్యంతో భారత్, అమెరికా కలిసి ముందుకు సాగేందుకు అవకాశమున్న రంగాల గురించి మోడీ, బైడెన్ మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధంపైనా మాట్లాడుకున్నారు. నేడు, రేపు స్విట్జర్లాండ్ వేదికగా జరగనున్న శాంతి సదస్సుపై బైడెన్, మోడీ చర్చించుకున్నారు. ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం ఆగేందుకు ఉన్న అవకాశాలపై ఇద్దరు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కాగా, ఇటలీలోని అపూలియాలో జీ7 దేశాల సదస్సు జరుగుతోంది. మూడో విడత ప్రధానిగా మోడీ బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన చేపట్టిన తొలి విదేశీ పర్యటన ఇదే.
We’re now on WhatsApp. Click to Join