గోవాలో తన పర్యటన సందర్భంగా ఆదివారం మోపాలో రెండో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. రూ.2,870 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ విమానాశ్రయం జనవరి 5 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. పీఎంవో కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం సాయంత్రం 5:15 గంటలకు మోపా ఇంటర్నేషనల్ను ప్రారంభిస్తారని పేర్కొంది. దేశమంతటా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను అందించడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర ప్రయత్నమని… ఈ దిశగా మరో అడుగు ముందుకేసి, గోవాలోని మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభిస్తారని పీఎంవో పేర్కొంది. విమానాశ్రయం మొదటి దశ సంవత్సరానికి 4.4 మిలియన్ల మంది ప్రయాణీకులకు (MPPA) అందిస్తుందని.. దీనిని 33 MPPA యొక్క సంతృప్త సామర్థ్యానికి విస్తరించవచ్చుని తెలిపింది. ఈ విమానాశ్రయం రాష్ట్ర సాంఘిక ఆర్థికాభివృద్ధిని పెంపొందిస్తుందని.. పర్యాటక పరిశ్రమ అవసరాలకు ఉపయోగపడుతుందని వెల్లడిచింది. అనేక దేశీయ మరియు అంతర్జాతీయ గమ్యస్థానాలను నేరుగా కలుపుతూ కీలకమైన లాజిస్టిక్స్ హబ్గా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉందని అధికారులు తెలిపారు. ఈ విమానాశ్రయానికి 2014లో టెండర్లు వేయగా, 2016లో అవార్డు లభించి, నవంబర్ 13, 2016న ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు.