Longest Railway Tunnel : దేశంలోనే పొడవైన రైలు సొరంగం.. ప్రారంభించిన ప్రధాని మోడీ

Longest Railway Tunnel : దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం ‘T-50’ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. 

  • Written By:
  • Publish Date - February 20, 2024 / 06:32 PM IST

Longest Railway Tunnel : దేశంలోనే అతి పొడవైన రైలు సొరంగం ‘T-50’ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు.  ఈ సొరంగాన్ని జమ్మూ-కశ్మీర్‌లోని ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా  బనిహాల్- ఖడీ- సుంబడ్‌- సంగల్‌దాన్‌ సెక్షన్‌‌లో 48.1 కి.మీ మేర నిర్మించారు. ఈ మార్గంలోనే ఖడీ- సుంబడ్‌ ప్రాంతాల మధ్య ‘టీ-50’ సొరంగం ఉంది. కశ్మీర్‌‌లో తొలిసారిగా ఎలక్ట్రిక్‌ రైళ్లను ప్రవేశపెట్టారు.  బారాముల్లా- శ్రీనగర్‌- సంగల్‌దాన్‌ మార్గంలో రెండు విద్యుత్‌ రైళ్లకు కూడా మోడీ పచ్చజెండా ఊపారు. ఈ కార్యక్రమం జమ్మూ నుంచి వర్చువల్‌గా జరిగింది.

We’re now on WhatsApp. Click to Join

సొరంగం విశేషాలు.. 

  • ‘టీ-50’ సొరంగం పొడవు 12.77 కి.మీ.
  • బనిహాల్- సంగల్‌దాన్‌ సెక్షన్‌లోని 11 సొరంగాల్లో ఇదే అత్యంత సమస్యాత్మకమైనది.
  • యూపీఏ ప్రభుత్వ హయాంలో 2010లో ఈ టన్నెల్ (Longest Railway Tunnel) పనులు ప్రారంభమయ్యాయి.
  • అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించేందుకు ‘టీ-50’కి సమాంతరంగా ఒక ఎస్కేప్ టన్నెల్ నిర్మించారు.
  • ప్రతీ 375 మీటర్ల దూరంలో ఈ రెండింటినీ కలుపుతూ మార్గాలు (క్రాస్‌ పాసేజ్‌) ఏర్పాటుచేశారు.

Also Read :IPL First Match : ఐపీఎల్ సీజన్ ఆరంభ తేదీ ఎప్పుడో తెలుసా ?

  • ఉధంపుర్- శ్రీనగర్- బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని రూ.41 వేల కోట్లతో చేపట్టారు. దీని మొత్తం పొడవు 272 కి.మీ.
  • బారాముల్లా- సంగల్‌దాన్‌, ఉధంపుర్‌- కాట్రా సెక్షన్‌ల మధ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
  • కాట్రా- సంగల్‌దాన్‌ల మధ్య 63 కిలోమీటర్ల మేర పనులు సాగుతున్నాయి.
  • ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి ‘చీనాబ్‌ వంతెన’, దేశంలో తొలి తీగల రైలు వంతెన ‘అంజీఖాడ్‌’ ఈ మార్గంలోనే ఉన్నాయి.

Also Read : Supreme Court : బీజేపీకి షాక్.. ఆ నగరం మేయర్‌ను మార్చేసిన సుప్రీంకోర్టు