Site icon HashtagU Telugu

Wayanad Landslide: వాయనాడ్‌ బాధితులకు ప్రధాని మోదీ 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా

Wayanad Landslide

Wayanad Landslide

Wayanad Landslide: కేరళలోని వాయనాడ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇది మంగళవారం తెల్లవారుజామున నాలుగు వేర్వేరు ప్రదేశాలలో కొండచరియలు విరిగిపడటానికి దారితీసింది. ఇందులో నాలుగు గ్రామాలు కొట్టుకుపోయాయి. అందులో ముండక్కై, చురల్మల, అట్టమల, నూల్‌పుజా కొట్టుకుపోయాయి గ్రామాలు ఉన్నాయి. భారీ వర్షాల కారణంగా ఇళ్లు, వంతెనలు, రోడ్లు, వాహనాలు సహా కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు 84 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గల్లంతయ్యారు. 250 మందికి పైగా రక్షించబడ్డారు.

ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. అదే సమయంలో కన్నూర్ నుండి 225 మంది సైనిక సిబ్బందిని వయనాడ్‌కు పంపారు, ఇందులో వైద్య బృందం కూడా ఉంది. వైమానిక దళానికి చెందిన రెండు హెలికాప్టర్లు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఐదేళ్ల క్రితం అంటే 2019లో ఇదే గ్రామాలైన ముండక్కై, చురల్‌మల, అట్టమల మరియు నూల్‌పుజాలో కొండచరియలు విరిగిపడి 52 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 17 మంది మృతి చెందగా, ఐదుగురు గల్లంతయ్యారు.

వాయనాడ్‌ పరిస్థితిపై దేశ ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌లో మృతుల సంఖ్య పెరగడంతో ప్రధాని దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు కేంద్రం ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుండి 2 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించింది. ఈ విధ్వంసానికి బలైన బాధితులకు కేంద్రం నుండి సాధ్యమయ్యే అన్ని సహాయాక సహకారాలు అందిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.

వాయనాడ్, కోజికోడ్, మలప్పురం, కాసరగోడ్‌లలో ఈరోజు కూడా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. అంటే ఈరోజు కూడా ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Also Read: Actress Smoking : దమ్ము మీద దమ్ము కొడుతున్న ప్రభాస్ హీరోయిన్..?