పాకిస్థాన్, చైనా నుంచి ఎదురవుతున్న రక్షణ సవాళ్లను దృష్టిలో పెట్టుకొని భారతదేశం స్వదేశీ వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టును ‘మిషన్ సుదర్శన్ చక్ర’ (Sudarshan Chakra)గా పిలుస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. దేశంలోని ముఖ్యమైన సైనిక, పౌర స్థావరాలను రక్షించడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ వ్యవస్థ ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ తరహాలో ఉంటుందని, ఎలాంటి శత్రు క్షిపణి దాడినైనా సమర్థవంతంగా ఎదుర్కోగలదని నిపుణులు భావిస్తున్నారు. శత్రు ముప్పును తగ్గించి, మన దేశం యొక్క రక్షణ సామర్థ్యాలను పెంచడమే ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం అని ప్రధాని మోదీ అన్నారు.
Cloudburst: జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు.. 65 మంది మృతి, 200 మంది గల్లంతు?
విదేశీ సాంకేతికతపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. భవిష్యత్ యుద్ధ విమానాలకు అవసరమైన జెట్ ఇంజిన్లను దేశీయంగానే తయారు చేసుకోవాలని యువ ఆవిష్కర్తలకు, పారిశ్రామికవేత్తలకు సూచించారు. దేశీయంగా జెట్ ఇంజిన్ అభివృద్ధి చేయాలని మోదీ నొక్కిచెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో తేలికపాటి యుద్ధ విమానాల కోసం ప్రారంభించిన ‘కావేరీ’ ఇంజిన్ ప్రాజెక్టు ఇంకా పూర్తికాలేదు. ఇదిలా ఉండగా, అమెరికా రక్షణ సంస్థ GE ఏరోస్పేస్తో HAL కుదర్చుకున్న ఒప్పందంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరాన్ని మోదీ ప్రస్తావించారు.
సరిహద్దుల్లో పాకిస్థాన్ ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, ఆ దేశ సైన్యాధిపతి అసిమ్ మునీర్ భారత ఆస్తులైన జామ్నగర్ రిఫైనరీ వంటి వాటిపై దాడి చేస్తామని ఇటీవల హెచ్చరించారు. ఈ బెదిరింపుల నేపథ్యంలోనే ‘మిషన్ సుదర్శన్ చక్ర’ ప్రకటన వెలువడింది. రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని ప్రదర్శించినందుకు మోదీ ‘ఆపరేషన్ సింధూర్’ను ప్రశంసించారు. విదేశీ రక్షణ సామగ్రిపై ఆధారపడకుండా, స్వదేశీ ఆయుధాలతోనే జరిపిన ఈ ఆపరేషన్ భారతదేశం యొక్క రక్షణ స్వావలంబనకు నిదర్శనమని అన్నారు. భారతదేశం తన సాంస్కృతిక, పౌరాణిక వారసత్వం నుంచి ప్రేరణ పొంది ఆధునిక రక్షణ ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్తుందని ఆయన పేర్కొన్నారు.