Israel Attack: ఉగ్రవాద దాడిని ఖండించిన ప్రధాని మోదీ

ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. హమాస్ రాకెట్ దాడిలో 40 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు.

Published By: HashtagU Telugu Desk
Israel Attack

Israel Attack

Israel Attack: ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాదులు భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. హమాస్ రాకెట్ దాడిలో 40 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. కాగా ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడిని ప్రధాని మోదీ ఖండించారు. హమాస్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు ప్రధాని మోదీ సంఘీభావం ప్రకటించారు. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడిని ఉగ్రవాద దాడిగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇజ్రాయెల్‌లో ఉగ్రదాడుల వార్త తనను దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాశారు.

శనివారం ఉదయం తీవ్రవాద సంస్థ హమాస్ ద్వారా గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్ వైపు భారీ సంఖ్యలో రాకెట్లు ప్రయోగించబడ్డాయి. హమాస్ అనేక ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో ఇప్పటివరకు 40 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. ఇది కాకుండా వందలాది మంది గాయపడ్డారు.

హమాస్ ఉగ్రవాదులు అనేక మంది ఇజ్రాయెల్‌ పౌరులను బందీలుగా చేసుకున్నారు . ప్రస్తుతం హమాస్ పై ఇజ్రాయెల్ ఎదురు దాడికి దిగింది. ఇజ్రాయెల్ వైమానిక దళం హమాస్ స్థానాలను లక్ష్యంగా చేసుకుంది. హమాస్ పర్యవసానాలను ఎదుర్కొంటుందని ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. పరిణామాలను ఎదుర్కొనేందుకు హమాస్ ఉగ్రవాదులు సిద్ధంగా ఉండాలని అన్నారు.

Also Read: Hamas attack on Israel: ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు జాగ్రత్త..

  Last Updated: 07 Oct 2023, 08:01 PM IST