Site icon HashtagU Telugu

Air India Flight: విమానంలో మరో మూత్ర విసర్జన ఉదంతం.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో ఘటన..!

Air India VRS

Air India VRS

Air India Flight: విమానంలో మూత్ర విసర్జన చేసిన మరో ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎయిర్ ఇండియా విమానం (Air India Flight)లో ఒక ప్రయాణికుడు మూత్ర విసర్జన చేశాడు. ముంబై నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఈ ఘటన జరగడంతో నిందితుడిని ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లోని పోలీస్ స్టేషన్‌లో ఫ్లైట్ కెప్టెన్ తరపున ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు నిందితుడిని అక్కడి నుంచి అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు రామ్ సింగ్ అని చెప్పారు.

హెచ్చరించినా ఆ వ్యక్తి ఆగలేదు

సమాచారం ప్రకారం.. ఈ సంఘటన జూన్ 24 న ఎయిర్ ఇండియా AIC 866 విమానంలో జరిగింది. పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. రామ్ సింగ్ అనే ప్రయాణికుడు విమానంలో మల, మూత్ర విసర్జన చేసి ఆపై ఉమ్మివేసాడు. ఈ సమయంలో సిబ్బంది ప్రయాణికుడికి మౌఖిక వార్నింగ్ ఇచ్చారని, అయినప్పటికీ అతను ఆగలేదని పోలీసు వర్గాలు తెలిపాయి.

ఎయిర్‌లైన్స్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. క్యాబిన్ సిబ్బంది వార్నింగ్ ఇవ్వడంతో విమాన కెప్టెన్‌కు సమాచారం అందించారు. దీని తరువాత కెప్టెన్ కంపెనీకి సందేశం పంపాడు. అందులో విమానాశ్రయ భద్రత నిందితుడిని విమానాశ్రయంలో పట్టుకోవాలని కోరింది. నిందితుడితో కలిసి ప్రయాణించే వ్యక్తులు ఈ పనికి వ్యతిరేకంగా నిరసన తెలిపారని, వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని, ఆ తర్వాత క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులందరినీ శాంతింపజేశారని ఎయిర్‌లైన్ కంపెనీ తెలిపింది. నిందితుడిని పోలీసులకు అప్పగిస్తామని అందరికీ చెప్పటంతో విషయం సద్దుమణిగింది.

Also Read: Women Activists In Manipur: మణిపూర్‌లో శాంతి ప్రయత్నాలకు అడ్డంకులు సృష్టిస్తున్న మహిళలు.. భారత సైన్యం ట్వీట్‌..!

నిందితుడికి బెయిల్ వచ్చింది

సమాచారం ప్రకారం.. నిందితుడు ఆఫ్రికాలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఎయిర్ ఇండియా విమానం AIC 866 ముంబై- ఢిల్లీ విమానంలో ప్రయాణించాడు. ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ఫ్లైట్ కెప్టెన్ ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు సెక్షన్ 294/510 కింద కేసు నమోదు చేశారు. నిందితుడైన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడిని కోర్టులో హాజరుపరచగా, అక్కడి నుంచి బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.