Indian Army: ఆగస్టు 5, 2025న పాకిస్తాన్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు జరిపిందనే వార్తలు అవాస్తవం అని భారత సైన్యం (Indian Army) స్పష్టం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపిందని వార్తలు ప్రచారమైనప్పటికీ అలాంటి సంఘటన ఏదీ జరగలేదని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.
There have been some media and social media reports regarding ceasefire violations in the Poonch region. It is clarified that there has been no ceasefire violation along the Line of Control: Indian Army pic.twitter.com/OhCLA9yh3b
— ANI (@ANI) August 5, 2025
జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి పుకార్లు వ్యాపించి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో భారత సైన్యం ఎలాంటి కాల్పులు జరగలేదని ధృవీకరించింది. కాబట్టి పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని చెప్పవచ్చు.
Also Read: BCCI: టీమిండియా ఆటగాళ్లకు భారీ షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?!
జమ్మూ-కాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడిందని వచ్చిన వార్తలపై భారత సైన్యం స్పందించింది. మంగళవారం రాత్రి పూంచ్ జిల్లాలోని మెంఢర్ ఉప జిల్లా, మన్కోట్ సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం 10-15 నిమిషాల పాటు కాల్పులు జరిపిందని వార్తలు వచ్చాయి. దీనిపై భారత సైన్యం స్పందిస్తూ, ఈ వార్తలు తప్పుదారి పట్టించేవి, అవాస్తవం అని కొట్టివేసింది. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరింది.
వార్తల కథనం ప్రకారం.. పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (LoC) వద్ద పాకిస్తాన్ సైన్యం అకస్మాత్తుగా కాల్పులు జరిపింది. భారత సైన్యం తమ రోజువారీ గస్తీలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని, భారత జవాన్లు గట్టిగా ప్రతిస్పందించడంతో కాల్పులు ఆగిపోయాయని ఆ కథనంలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కాల్పుల వెనుక ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం కల్పించడమే పాకిస్తాన్ ఉద్దేశమని గూఢచార వర్గాలు భావిస్తున్నాయని కూడా అందులో ఉంది.
సైన్యం వివరణతో స్పష్టత
అయితే, భారత సైన్యం ఈ వార్తలను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ నుండి ఎలాంటి కాల్పులు జరగలేదని స్పష్టం చేసింది. ఈ ఘటనపై వచ్చిన వార్తలు తప్పుడువి. ప్రజలను గందరగోళపరిచేవి అని తేల్చిచెప్పింది. ఈ వివరణతో సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగాయనే వార్తలపై స్పష్టత వచ్చింది.