Parliament : కుంకుమ విలువ ఏంటో ఆమెకు తెలియదు.. జయాబచ్చన్ కు రేఖా గుప్తా కౌంటర్

Parliament : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్థాన్‌పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Rekha Gupta Vs Jaya Bachcha

Rekha Gupta Vs Jaya Bachcha

Parliament : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్థాన్‌పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఈ ఆపరేషన్‌పై పార్లమెంట్‌లో విస్తృతంగా చర్చ జరిగిన సమయంలో బాలీవుడ్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయాబచ్చన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ అనే పేరుపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ, దానికి సరైన అర్థం లేదని అన్నారు.

జయాబచ్చన్ వ్యాఖ్యలపై ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఘాటుగా స్పందించారు. “జయాబచ్చన్‌కి సినిమాలు తెలుసు, కానీ మాకు దేశం తెలుసు,” అంటూ ఆమె విరుచుకుపడ్డారు. సినిమా భాషలోనే సమాధానం ఇస్తానని రేఖా గుప్తా స్పష్టం చేశారు.

AP Roads : ఆంధ్రప్రదేశ్ రోడ్ల మరమ్మతులో కొత్త శకం – చంద్రబాబు

“ఆమెకు దేశ వాస్తవ పరిస్థితులు తెలియవు. కుంకుమ విలువ ఏంటో ఆమెకు తెలియదు. ఒక మహిళ వితంతువుగా మారినప్పుడు సిందూరాన్ని కోల్పోతుంది. ఈ దేశం తన కుమారులను ఉగ్రదాడిలో కోల్పోయింది. అందుకే ఈ ఆపరేషన్‌కి ఆపరేషన్ సిందూర్ అని పేరు పెట్టాం,” అని రేఖా గుప్తా వివరించారు.

విపక్ష పార్టీలపై కూడా రేఖా గుప్తా తీవ్ర విమర్శలు చేశారు. “ఈ దేశాన్ని ప్రేమించలేరు కానీ దేశ వ్యతిరేక శక్తులను మాత్రం ప్రేమిస్తారు. భారతీయులమని చెప్పుకుంటూ పాకిస్థాన్ ప్రతినిధుల్లా వ్యవహరిస్తున్నారు,” అంటూ ఆమె దుయ్యబట్టారు.

పహల్గామ్ ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్‌తో భారత్ సరైన సమాధానం ఇచ్చిందని రేఖా గుప్తా స్పష్టం చేశారు. “ఈ ఆపరేషన్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇచ్చిన గౌరవం. అది సింబాలిక్‌గా దేశ తల్లితనం, త్యాగాన్ని ప్రతిబింబిస్తుంది,” అని ఆమె అన్నారు.

జయాబచ్చన్ వ్యాఖ్యలు, రేఖా గుప్తా ప్రతిస్పందనతో ఈ వివాదం మరింత తీవ్రతరమైంది. ఆపరేషన్ సిందూర్ పేరుపై దేశవ్యాప్తంగా మద్దతు, వ్యతిరేకత చర్చకు దారితీస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ ఆపరేషన్ పేరులో ఉన్న భావనను రక్షించడంపై నిలకడైన స్థాయిని కొనసాగిస్తోంది.

NDA Meet : ఇటువంటి ప్రతిపక్ష నేతలను ఇంకెక్కడా చూడలేదు: ప్రధాని మోడీ

  Last Updated: 05 Aug 2025, 01:46 PM IST