Site icon HashtagU Telugu

Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

Operation Sindoor

Operation Sindoor

Operation Sindoor : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య మే 10న మధ్యాహ్నం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనుండటం ఇదే తొలిసారి. భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌కు అండగా నిలిచినందుకు దేశ ప్రజలకు ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపే అవకాశం ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే) ముమ్మాటికీ భారత్‌దే.. పాక్ ఉగ్రవాదులకు భారత్‌కు అప్పగించాల్సిందే అనే అంశాలతో ప్రధాని మోడీ ప్రసంగం సాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. కశ్మీర్ అంశంలో మూడో దేశం జోక్యాన్ని అంగీకరించేది లేదని మోడీ తేల్చి చెప్పే ఛాన్స్ ఉంది.

మే 7 నుంచి ఏమేం జరిగాయి ?