PM Modi Birthday Special : చెప్పులు కుట్టే వారి చిరకాల కోరిక తీరుస్తున్న మోడీ అభిమానులు..!!!

సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజును జరపుకోనున్నారు.

  • Written By:
  • Publish Date - September 15, 2022 / 05:41 PM IST

సెప్టెంబర్ 17 భారత ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజును జరపుకోనున్నారు. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా దేశరాజధాని ఢిల్లీకి చెందిన 40 మంది చెప్పులు కుట్టేవారికి విమానంలో ప్రయాణించే అవకాశం లభించనుంది. ఢిల్లీ నుంచి వారణాసికి విమాన ప్రయాణం కోసం బీజేపీ నేత ఆదేశ్ గుప్తా వారిని పంపించనున్నారు. మొత్తం 40మంది చెప్పులు కుట్టేవారు వారణాసిలో దేవాలయాలను సందర్శిస్తారు.

ఈస్ట్ ఢిల్లీ మాజీ మేయర్ శ్యామ్ సుందర్ అగర్వాల్ తన సొంత ఖర్చులతో కృష్ణానగర్, గాంధీనగర్ ప్రాంతాల్లో చెప్పులు కుట్టే పని చేసే 40 మందితో వారణాసి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చెప్పులు కుట్టే వారికి ఉచిత విమాన ప్రయాణంతోపాటు వారణాసి హోటళ్లలో బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వారి రెండు రోజుల పర్యటనలో, వారణాసిలోని కాశీ విశ్వనాథ్ తోపాటు ఇతర మతపరమైన ప్రదేశాలను సందర్శించనున్నారు.

చెప్పులు కుట్టే వారి రోజువారీ ఆదాయం 200 నుంచి 300 రూపాయలు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విమాన ప్రయాణం చేయడం వారికి ఓ కలలాంటిది. వారికి విమాన ప్రయాణం అంటే చాలా ఉత్సాహంగా ఉంది.మేము విమానంలో ప్రయాణిస్తామని ఎప్పుడు అనుకోలేదు. నిజంగా మా కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వారు అంటున్నారు. కాగా దేశవ్యాప్తంగా మోదీ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సంక్షేమ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.