National Parties Vs Incomes: ‘అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్’ (ADR) మరో సంచలన నివేదికను విడుదల చేసింది. దేశంలోని జాతీయ రాజకీయ పార్టీలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయాల వివరాలను ఈ నివేదికలో ప్రస్తావించారు.
Also Read :Places Of Worship Case: ‘‘ఇక చాలు..’’ ప్రార్థనా స్థలాల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
2023-24లో జాతీయ పార్టీల ఆదాయ వివరాలివీ..
- 2023 – 24లో మన దేశంలో అత్యధికంగా రూ.4,340.47 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన జాతీయ పార్టీ బీజేపీ.
- దేశంలోని 6 జాతీయ పార్టీల(National Parties Vs Incomes) మొత్తం ఆదాయంలో 74.57 శాతాన్ని ఒక్క బీజేపీయే ఆర్జించింది.
- బీజేపీ తమ ఆదాయంలో రూ.2,211.69 కోట్లే ఖర్చు చేసింది.
- కాంగ్రెస్ పార్టీకి రూ.1,225.12 కోట్ల ఆదాయం రాగా, రూ.1,025.25 కోట్లు ఖర్చు చేసింది.
- 2023-24లో ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీకి రూ.1,685.63 కోట్లు, కాంగ్రెస్కు రూ.828.36 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.10.15 కోట్ల విరాళాలు వచ్చాయి.
- బీజేపీ, కాంగ్రెస్, ఆప్లకు ఎన్నికల బాండ్ల ద్వారా రూ.2,524.13 కోట్ల విరాళాలు వచ్చాయి.
Also Read :Ayodhya Ram Mandir: షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను దాటేసిన అయోధ్య రామమందిరం
- 2023-24లో ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చిన రూ.4,507.56 కోట్ల విరాళాలను దేశంలోని రాజకీయ పార్టీలు నగదుగా మార్చుకున్నాయి. ఇందులో రూ.2,524.13 కోట్లను కేవలం జాతీయ పార్టీలే విత్డ్రా చేసుకున్నాయి.
- కాంగ్రెస్ పార్టీ రూ.619.67 కోట్లను గత ఎన్నికల్లో ఖర్చు చేసింది. పార్టీ పాలనా వ్యవహారాలు, సాధారణ ఖర్చులకు రూ.340.70 కోట్లను వెచ్చించింది.
- సీపీఎం పార్టీపరమైన పాలనా వ్యవహారాలు, సాధారణ ఖర్చులకు రూ.56.29 కోట్లను వెచ్చించింది. ఉద్యోగుల కోసం రూ.47.57 కోట్లను ఖర్చు చేసింది.
- 2023-24లో విరాళాలు, ఆర్థిక సాయాల ద్వారా జాతీయ పార్టీలకు రూ.2,669.87 కోట్లు సమకూరాయి. ఇందులో కాంగ్రెస్కు రూ.58.56 కోట్లు, సీపీఎంకు రూ.11.32 కోట్లు వచ్చాయి.
- సీపీఎం, కాంగ్రెస్, బీజేపీల విరాళాలకు సంబంధించిన ఆడిట్ నివేదికలు సగటున 12 నుంచి 66 రోజులు ఆలస్యంగా కేంద్ర ఎన్నికల సంఘానికి అందాయి.