Site icon HashtagU Telugu

Railway Consession : వృద్ధుల‌కు రైల్వే రాయితీలు ఇక లేన‌ట్టే!

Indian Railways

Indian Railways

వృద్ధుల‌కు రాయితీలను ర‌ద్దు చేసిన మోడీ స‌ర్కార్ గ‌త రెండేళ్లుగా 1500 కోట్ల‌ను ఆదా చేసింది. వివిధ ర‌కాలుగా రాయితీల రూపంలో ఏడాదికి రూ. 2వేల కోట్ల‌ను భార‌త రైల్వే కోల్పోతుంద‌ని కేంద్రం అంచ‌నా వేస్తోంది. ఇలాంటి లెక్క‌లు వేస్తోన్న మోడీ స‌ర్కార్ రాబోవు రోజుల్లో కూడా వృద్దుల‌కు రాయితీ రైల్వే టిక్కెట్ ఇవ్వ‌ద‌ని తెలుస్తోంది. కోవిడ్ ముందు వ‌ర‌కు 60 ఏళ్లు పై బడిన పురుషుల‌కు, 58 ఏళ్ల పైబ‌డిన మ‌హిళ‌ల‌కు 50శాతం రాయితీ ఇచ్చింది. ఆ రాయితీని 2020 మార్చి నుంచి ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కోవిడ్ కార‌ణంగా ఆ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు అప్ప‌ట్లో చెప్పింది. కానీ, ఇప్పుడు ఆదాయాన్ని చూసిన కేంద్రం తిరిగి పున‌రుద్ద‌రించే ఆలోచ‌న‌కు దూరంగా ఉంది.

ఇక వృద్ధులకు రైలు టికెట్లలో రాయితీ ఇక చూసే అవకాశం లేకపోవచ్చు. కరోనా వచ్చిన తర్వాత రైలు ప్రయాణాలపై అన్నిరకాల రాయితీలను నిలిపివేయడం తెలిసిందే. ఇదంతా తాత్కాలికమే అని అనుకున్నారు. కానీ, ఇలా రాయితీలు ఎత్తేయడం వల్ల వచ్చిన భారీ ఆదాయం చూసి రైల్వే శాఖ పునరాలోచనలో పడిపోయింది. 2020 మార్చి నుంచి రెండేళ్లలో వృద్ధులకు రాయితీ తీసేయడం వల్ల రైల్వే శాఖకు అదనంగా రూ.1,500 కోట్ల ఆదాయం సమకూరింది. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఒక దరఖాస్తుకు రైల్వే శాఖ వెల్లడించిన సమాచారమే ఈ విషయాన్ని ధ్రువీక‌రిస్తోంది. ఆర్టీఐ ద్వారా మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ ఈ సమాచారాన్ని తీసుకున్నారు.

2020 మార్చి నుంచి 2022 మార్చి 31 వరకు 7.31 కోట్ల వృద్ధులకు రాయితీలను ఇవ్వలేదని రైల్వే శాఖ తెలిపింది. ఇందులో 60 ఏళ్లు నిండిన మగవారు 4.46 కోట్లు కాగా, 58 ఏళ్లు నిండిన స్త్రీలు రూ.2.84 కోట్ల మంది ఉన్నారు. 60 ఏళ్లు నిండిన మగవారు, 58 ఏళ్లు నిండిన స్త్రీలకు టికెట్లలో 50 శాతం రాయితీ గతంలో ఉండేది. మరి ఇంత ఆదాయన్ని రైల్వే మళ్లీ కోల్పోవడానికి సిద్ధపడుతుందా? చూడాలి.

Exit mobile version