Site icon HashtagU Telugu

Nitish Kumar: ఎమ్మెల్సీ ఎన్నికలకు నితీష్ నామినేషన్ రేపే

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మార్చి 6న నితీశ్‌కుమార్‌ ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్నందున ఒకరోజు ముందుగానే నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. వారం రోజుల పాటు ఇంగ్లండ్‌లో మకాం వేసి బీహార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు. బీహార్ శాసన మండలిలో జేడీ-యూ రెండు సీట్లు గెలుచుకోవాలని భావిస్తోంది. నితీష్ కుమార్‌కు ఒక సీటు ఖాయమైనప్పటికీ, మరో అభ్యర్థి పేరును పార్టీ ప్రకటించలేదు.

నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్రీదేవి సహా 11 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ఈ ఏడాది మే మొదటి వారంలో ముగియనుంది. వీరితో పాటు సయ్యద్ షానవాజ్ హుస్సేన్ (బిజెపి), సంజయ్ కుమార్ ఝా (జెడి-యు), ప్రేమ్ చంద్ర మిశ్రా (కాంగ్రెస్), సంతోష్ కుమార్ సుమన్ (హెచ్‌ఎఎం-ఎస్), మంగళ్ పాండే (బిజెపి), రామ్ చంద్ర పూర్వే (ఆర్‌జెడి), ఖలీద్ అన్వర్ (జెడి-యు), రామేశ్వర్ మహ్తో (జెడి-యు) మరియు సంజయ్ పాశ్వాన్ (బిజెపి)ల గడువు ఈ ఏడాది మే మొదటి వారంలో ముగుస్తుంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ పత్రాల దాఖలుకు మార్చి 11 చివరి తేదీ కాగా మార్చి 14 వరకు అభ్యర్థులు తమ పేర్లను ఉపసంహరించుకోవచ్చు.మార్చి 21న ఎన్నికలు నిర్వహించి అదే రోజు ఫలితాలు వెల్లడిస్తారు.

Also Read: Crime News: అనుమానంతో భార్యని కడతేర్చిన భర్త