NIA Raids: రాజస్థాన్‌లో ఎన్‌ఐఏ దాడులు, 12 మంది అరెస్ట్

రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్ గ్రూపుకు చెందిన 12 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 01:30 PM IST

NIA Raids: ఖలిస్తానీ – ​​గ్యాంగ్‌స్టర్ గ్రూపుల స్థావరాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ ఉదయం నుంచి రాజస్థాన్‌లో దాడులు నిర్వహిస్తోంది. శ్రీగంగానగర్, హనుమాన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, ఝుంఝును సహా ఇవే జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు రైడ్స్ చేశారు. ఐదు జిల్లాల్లో రాష్ట్రవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్ గ్రూపుకు చెందిన 12 మందికి పైగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ (ATS) డైరెక్టర్ జనరల్ అన్షుమన్ భోమ్లా ఈ దాడులను ధృవీకరించారు.

ఈ టాస్క్ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను మీడియాకు వెల్లడిస్తామని వివరించారు. అరెస్టయిన వారిలో ఖలిస్తానీలతో పరిచయం ఉన్న విద్యార్థి సంఘం నాయకుడు కూడా ఉన్నాడు. సదర్ పోలీస్ స్టేషన్, సూరత్‌గఢ్ (సిటీ), కెంచియా, శ్రీగంగానగర్ జిల్లా రాజయ్యసర్ మరియు హనుమాన్‌ఘర్‌లోని గోలువాలా పరిధిలోని పలు చోట్ల దాడులు జరిగాయి.

కెనడాకు చెందిన ఖలిస్తానీ గ్రూపుతో టచ్‌లో ఉన్న వ్యక్తిని జిల్లాలోని చయాన్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు జైసల్మేర్ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ సంగ్వాన్ తెలిపారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన నేపథ్యంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్‌ఐఏ దాడులు జరిగాయి.