NEET-PG 2022: నీట్ ఎగ్జామ్ వాయిదా పడిందా? సోషల్ మీడియాలో ప్రచారం నిజమేనా..?

నీట్ పీజీ 2022 వాయిదా పడుతుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

  • Written By:
  • Publish Date - May 7, 2022 / 11:13 PM IST

నీట్ పీజీ 2022 వాయిదా పడుతుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ఓ కీలక ప్రకటనను రిలీజ్ చేసింది. వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై అభ్యర్థుల్లో అనుమానాలకు క్లారిటీ ఇచ్చింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మోద్దని అభ్యర్థులను హెచ్చరించింది. శనివారం సాయంత్రం ఈ మేరకు ఎన్బిఈఎంఎస్ హెచ్చరిక నోటీసు జారీ చేసింది. నీట్ పరీక్షను జూలై 9కి వాయిదా వేస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని నీట్ పీజీ పరీక్ష 2022షెడ్యూల్ ప్రకారమే మే 21న నిర్వహిస్తామని….అందులో ఎలాంటి మార్పులు లేవని బోర్డ్ తెలిపింది.

ఎలాంటి సమాచారమైన సరే NBEMS అధికారిక వెబ్ సైట్లో మాత్రమే ప్రకటిస్తామని వేరే ప్లాట్ ఫామ్స్ పై ఎలాంటి ప్రకటనలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. NBEMSకి సంబంధించి ఎలాంటి సమాచారం కోసమైనా అధికారిక వెబ్ సైట్స్ ను సందర్శించాలని అభ్యర్థులకు సూచించింది. కొందరు వ్యక్తులు అభ్యర్థులను కావాలనే తప్పుదారి పట్టించాలనే NBEMSపేరిట ఫేక్ నోటీసులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని NBEMS తెలిపింది. జూలై2020 నుంచి జారీ చేసిన అన్ని NBEMS నోటీసులకు క్యూఆర్ కోడ్ కలిగి ఉంటుంది. క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయడం ద్వారా నిజమైన సమాచారం అభ్యర్థులకు తెలుస్తుందని..తప్పుడు ప్రచారం నుంచి విముక్తి లభిస్తుందని NBEMS అభిప్రాయపడింది. ఈ మేరకు వెబ్ సైట్ లో ఓ నోటిసు కూడా పెట్టింది.

కాగా NBEMS ధృవీకరించని సమాచారాన్ని చూసి మోసపోవద్దని సూచించింది. అలాంటి సమాచారం మీ వద్దకు వస్తే కచ్చితంగా NBEMSకి వెబ్‌సైట్ ద్వారా క్రాస్ వెరిఫై చేయమని అభ్యర్థులను కోరుతోంది.