Bihar Election Results : బిహార్ లో మరోసారి ఎన్డీయేదే విజయం – మోదీ

Bihar Election Results : బిహార్ రాష్ట్రంలో జరిగిన తొలి దశ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. సుమారు 64.66 శాతం పోలింగ్ నమోదవడం ప్రజల రాజకీయ చైతన్యాన్ని స్పష్టంగా చూపిందని విశ్లేషకులు అంటున్నారు.

Published By: HashtagU Telugu Desk
PM Modi

PM Modi

బిహార్ రాష్ట్రంలో జరిగిన తొలి దశ ఎన్నికలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. సుమారు 64.66 శాతం పోలింగ్ నమోదవడం ప్రజల రాజకీయ చైతన్యాన్ని స్పష్టంగా చూపిందని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ భారీ పోలింగ్ ఫలితాలు NDA ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, దేశం స్థిరత్వం వైపు పయనిస్తోందని ఆయన అన్నారు. బిహార్ ప్రజలు గతంలో అభివృద్ధి దిశగా అడుగులు వేసిన ఎన్డీఏ పాలనను కొనసాగించాలనే సంకల్పంతో ఓటు వేశారని మోదీ వ్యాఖ్యానించారు.

Hyderabad : హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెస్సే – సీఎం రేవంత్

ప్రధానమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు జేడీయూ పార్టీ యొక్క “అబద్ధాల ప్యాకేజీ”ని తిరస్కరించారని అన్నారు. గతంలో జేడీయూ ప్రభుత్వం ప్రజలను మోసగించిందని, వాగ్దానాలు చేసి అమలు చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. బిహార్‌లో అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, మౌలిక వసతులు—ఇలా అన్ని ఎన్డీఏ పాలనలోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. “ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నది. ఇప్పుడు ప్రజల తీర్పు మళ్లీ అభివృద్ధి పథకాలకు మద్దతుగా మారుతోంది” అని మోదీ అన్నారు.

అలాగే, బిహార్ రాష్ట్రంలో గతంలో నెలకొన్న ‘జంగిల్ రాజ్’ పరిస్థితులు మళ్లీ రానివ్వకూడదని ప్రజలను హెచ్చరించారు. నేరం, అవినీతి, వంశపారంపర్య రాజకీయాల పాలన మళ్లీ పునరావృతం కాకుండా ఉండటానికి ప్రజలు ఈసారి చైతన్యంతో వ్యవహరించారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం బిహార్‌ను అభివృద్ధి రాష్ట్రంగా మార్చి, పరిశ్రమలు, విద్య, రహదారుల రంగాల్లో విశేష పురోగతి సాధించిందని మోదీ గుర్తుచేశారు. ఆయన ప్రజలను ఉద్దేశించి, “ఇది కొత్త బిహార్ నిర్మాణ దశ. అభివృద్ధిని ఎంచుకోండి, అశాంతిని కాదు” అంటూ పిలుపునిచ్చారు.

  Last Updated: 07 Nov 2025, 07:40 PM IST