Site icon HashtagU Telugu

NDA Vs PDA : ఇవాళే బెంగళూరులో 26 విపక్షాల భేటీ.. రేపు ఢిల్లీలో 30 “ఎన్డీఏ” పార్టీల సమావేశం

Nda Vs Pda

Nda Vs Pda

NDA Vs PDA :  2024 లోక్ సభ ఎన్నికల కోసం అధికార, విపక్ష కూటముల ఏర్పాటు ప్రయత్నాలు స్పీడప్ అయ్యాయి.  ఈక్రమంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష కూటమి బల ప్రదర్శనకు రెడీ అయ్యాయి. ప్రాంతీయ సమీకరణాలు, పరస్పర రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా తమకు మద్దతునిచ్చే పార్టీలతో ఆయా కూటములు ఏకకాలంలో భేటీ కాబోతున్నాయి. సోమ, మంగళవారాల్లో (నేడు, రేపు) బెంగళూరు వేదికగా 24 విపక్ష పార్టీలు సమావేశం కాబోతుండగా.. మంగళవారం (జులై 18న) ఢిల్లీ వేదికగా దాదాపు 30 పార్టీల మద్దతు కలిగిన ఎన్డీఏ కూటమి భేటీ జరగబోతోంది. ఈసారి జరగనున్న మీటింగ్ కు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే సోనియా గాంధీ కూడా దీనికి హాజరవుతున్నారు. ఇక ఎన్డీఏ కూటమి భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. దీంతో ఈ మీటింగ్ లలో(NDA Vs PDA) ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. జులై 20 నుంచి మొదలుకానున్న పార్లమెంటు సమావేశాల్లో ఉమ్మడిగా అనుసరించాల్సిన వ్యూహాలు, యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)పై వైఖరి వంటి వాటిపైనా చర్చించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.

Also read : Hindu Temple Demolished: పాకిస్థాన్‌లో 150 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత.. కారణమిదే..?

విపక్ష కూటమి చైర్ పర్సన్ గా సోనియా గాంధీ ?

Also read : James Anderson: ఇంగ్లండ్ కు గుడ్ న్యూస్.. ఆస్ట్రేలియాతో జరిగే నాలుగో టెస్టుకు జట్టులోకి జేమ్స్ ఆండర్సన్..!

ఎన్డీఏలోకి 6 కొత్త పార్టీలు ..

Also read : Carlos Alcaraz: వింబుల్డన్‌లో జకోవిచ్‌ కు షాక్ ఇచ్చిన కార్లోస్ అల్కరాజ్.. టైటిల్ గెలుచుకున్న అల్కరాజ్‍

ఏపీలో జనసేనతో పొత్తు..నితీష్ కు చెక్ పెట్టేందుకు రంగంలోకి నలుగురు  

విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు చెక్ పెట్టడంతో పాటు అక్కడి 40 లోక్ సభ స్థానాలు లక్ష్యంగా బీహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ, హిందుస్తానీ అవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా, వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీలను ఎన్డీఏలో చేర్చుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ మీటింగ్ కు సడెన్ గా మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జేడీ (ఎస్) తరఫున ఆయన కుమారుడు కుమారస్వామి హాజరైనా ఆశ్చర్యం లేదంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఎన్డీఏ పాత మిత్రులు తెలుగుదేశం పార్టీ, శిరోమణి అకాలీదళ్‌ పార్టీలు కూడా మళ్ళీ అదే గూటికి చేరుతారనే ప్రచారం జరిగినప్పటికీ .. అది ఇక జరగకపోవచ్చంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆ రెండు పార్టీలకు బీజేపీ చీఫ్ నడ్డా నుంచి ఇన్విటేషన్ అందకపోవడమే దానికి సంకేతమని చెబుతున్నాయి. పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని పేర్కొన్నాయి.