Site icon HashtagU Telugu

Lok Sabha Speaker: స్పీకర్ పదవిపై రగడ..టీడీపీ కీ రోల్. కూటమిలో విభేదాలు

Lok Sabha Speaker

Lok Sabha Speaker

Lok Sabha Speaker: ఒకవైపు లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై రాజకీయాలు రసవత్తరంగా సాగుతుండగా, స్పీకర్ పదవి తమకే ఉంటుందని ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ స్పష్టం చేసింది. మరోవైపు మిత్రపక్షాలతో ఏకాభిప్రాయానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని.  ఆ బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు అప్పగించారు. ఇక్కడ విపక్షం కూడా తనదైన లక్ష్యంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో అడుగుపెట్టింది. ముందుగా డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.

లోక్‌సభ స్పీకర్‌ పదవిని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జనతాదళ్‌ లకు ఇవ్వాలని విపక్షాలు కూడా పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఇండియా కూటమి మద్దతు కూడా రెండు పార్టీలకు అందించింది. అయితే ఇందులో ప్రతిపక్షాల వల్ల ప్రయోజనం ఏంటన్నది ఇక్కడ ప్రశ్న…

ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చెందిన టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కింగ్ మేకర్లుగా అవతరించడం గమనార్హం. స్పీకర్ తమకే కావాలని టీడీపీ భావిస్తోందని, అందుకే స్పీకర్ పదవిపై టీడీపీ ఆశయానికి ఆజ్యం పోసి ఎన్డీయే ప్రభుత్వంలో విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్ష కూటమి ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష కూటమి ప్రకారం చంద్రబాబు నాయుడు ఎన్డీయే నుండి వైదొలిగితే, మోడీ ప్రభుత్వం 3.0 బలం 293 నుండి 277 కి తగ్గుతుంది, ఇది మెజారిటీకి అవసరమైన 272 కంటే కేవలం ఐదు ఎక్కువ. దీంతో ప్రభుత్వం అస్థిరతకు గురవుతుంది. దీంతో పాటు డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష కూటమికి వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అయితే గత లోక్‌సభలో ఈ పదవి ఐదేళ్లుగా ఖాళీగా ఉంది. అయితే ఈసారి దాన్ని పునరావృతం చేసే మూడ్‌లో విపక్షాలు లేవు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 293 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీ నుంచి 240, టీడీపీ నుంచి 16, జేడీయూ నుంచి 12, శివసేన (షిండే) నుంచి ఏడుగురు, లోక్ జనశక్తి పార్టీ నుంచి ఐదుగురు ఎంపీలు ఉన్నారు. మిగిలిన 10 పార్టీల నుంచి 13 మంది ఎంపీలు ఉన్నారు. మరోవైపు విపక్షమైన ఇండియా 234 సీట్లు గెలుచుకుంది.

Also Read: Jagan : రేపు పులివెందులకు వైస్ జగన్