Navjot Kaur: సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. ఇక మనం కలవలేమా అంటూ ఎమోషనల్ పోస్టు..!

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్‌ (Navjot Kaur)కు క్యాన్సర్‌ సోకింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్ సోకింది.

Published By: HashtagU Telugu Desk
Navjot Kaur

Resizeimagesize (1280 X 720) (4)

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్‌ (Navjot Kaur)కు క్యాన్సర్‌ సోకింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్ సోకింది. పంజాబ్‌ మాజీ మంత్రి నవజోత్‌ కౌర్‌ సిద్ధూ తన అస్వస్థత గురించి తెలియగానే ట్వీట్‌ ద్వారా సమాచారాన్ని పంచుకున్నారు. హిందూస్థాన్ టైమ్స్ వార్తల ప్రకారం.. నవజ్యోత్ కౌర్ భర్త నవజ్యోత్ సిద్ధూకు రాసిన లేఖలో తాను (నవ్‌జోత్ సింగ్ సిద్ధూ) చేయని నేరానికి పాటియాలా సెంట్రల్ జైలులో ఉన్నారని రాశారు. ఇందులో పాల్గొన్న వారందరినీ క్షమించండి. ప్రతిరోజూ జైలు బయట నీకోసం ఎదురుచూడడం నీకంటే నాకే ఎక్కువ బాధ కలిగిస్తుంది. ఎప్పటిలాగే నేను మీ బాధను పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదంతా చాలా చెడ్డదని నాకు తెలుసు, కానీ దానిలో కొంత మెరుగుదల ఉందని పేర్కొన్నారు.

Also Read: Hindenburg: మరో దెబ్బ కొట్టిన హిండెన్ బర్గ్.. ఈ సారి ట్విట్టర్ మాజీ సీఈవో వంతు..!

మరో ట్వీట్‌లో నవజ్యోత్ కౌర్ లేఖలో ఇలా రాశారు. ‘మీరు న్యాయం కోసం పదేపదే వేడుకున్నా న్యాయం జరగలేదు. నేను మీ కోసం వేచి ఉన్నాను. సత్యం చాలా శక్తివంతమైనది. కానీ అది మిమ్మల్ని ప్రతిసారీ పరీక్షిస్తుంది. ఇది కలియుగం. క్షమించండి. నాకు స్టేజ్-2 క్యాన్సర్ ఉన్నందున మీ కోసం వేచి ఉండలేను. ఈరోజు సర్జరీ చేయాల్సి ఉంది. ఇది దేవుని చిత్తం కాబట్టి దీనికి ఎవరినీ నిందించకూడదని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్‌కు చెందిన అమరీందర్ సింగ్ రాజా వారింగ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అమరీందర్ సింగ్ ఒక ట్వీట్‌లో ఇలా రాశారు.. ‘మీరు శస్త్రచికిత్స చేయించుకోవాలని విన్నందుకు నేను చాలా చింతిస్తున్నాను. కానీ అదృష్టవశాత్తూ మీరు వ్యాధి గురించి సమయానికి తెలుసుకున్నారు. మీరు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని పేర్కొన్నారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం పంజాబ్‌లోని పాటియాలా జైలులో ఉన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల తర్వా అతను రోడ్డు రేజ్ కేసులో ఒక సంవత్సరం జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. నవజ్యోత్ సింగ్ సిద్ధూ 1988 రోడ్డు రేజ్ డెత్ కేసులో ఒక సంవత్సరం జైలు శిక్షను అనుభవిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన పాటియాలా సెంట్రల్ జైలులో ఉన్నారు. 2018లో రూ. 1,000 నామమాత్రపు జరిమానాతో వదిలివేయబడ్డాడు.

  Last Updated: 24 Mar 2023, 11:01 AM IST