Site icon HashtagU Telugu

Nagpur Violence : నాగ్‌పూర్ అల్లర్ల మాస్టర్‌మైండ్ ఫహీం.. ఎఫ్‌ఐఆర్‌లో కీలక వివరాలు

Nagpur Violence Mastermind Faheem Khan Nagpur Rioters Fir

Nagpur Violence : సోమవారం రోజు (మార్చి 17) మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్ల మాస్టర్‌మైండ్ ఫహీం షమీమ్ ఖాన్ అని పోలీసులు వెల్లడించారు. అతడి ఫొటోను మీడియాకు విడుదల చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన అల్లర్లపై నగరంలోని గణేశ్ పేట్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో కీలక వివరాలు ఉన్నాయి. దాని ప్రకారం..  మైనారిటీ డెమొక్రటిక్ పార్టీ (ఎండీపీ) అధ్యక్షుడు ఫహీం షమీమ్ ఖాన్ సారథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీగా జనం గుమిగూడారు. ఆ గుంపులోని పలువురి చేతుల్లో కత్తులు, రాళ్లు, కర్రలు, ప్రమాదకరమైన ఆయుధాలు ఉన్నాయి. ఈ వ్యక్తులు భయాన్ని సృష్టించి, మతపరమైన వైరాన్ని పెంచే ఉద్దేశంతో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీయడానికి యత్నించారు. నాగ్‌పూర్ నగరంలోని భల్దార్‌పురా చౌక్ ప్రాంతంలో ఆ గుంపులోని కొంతమంది వ్యక్తులు పోలీసు బృందంపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సమయంలో, ఒక దుండగుడు మహిళా కానిస్టేబుల్ యూనిఫామ్‌ను చింపి, ఆమె శరీరాన్ని తాకడానికి ప్రయత్నించాడు. అందుకే ఈ అల్లర్లకు మాస్టర్ మైండ్‌గా ఫహీం షమీమ్ ఖాన్‌ను పోలీసులు గుర్తించారు. ఫహీం షమీమ్ ఖాన్(Nagpur Violence) 2024 ఎన్నికల్లో నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశాడు. మైనారిటీస్ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా అతడు అప్పట్లో ఎన్నికల్లో పోటీ చేశాడు. నాగ్‌పూర్‌లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో  గడ్కరీ చేతిలో ఫహీం షమీమ్ ఖాన్ 6.5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

Also Read :Kennedy Assassination: జాన్‌ ఎఫ్‌ కెనడీ హత్య.. సీక్రెట్ డాక్యుమెంట్లు విడుదల.. సంచలన వివరాలు

నాగ్‌పూర్  అల్లర్లపై ఎఫ్‌ఐఆర్‌లో..

Also Read :Investment : భూమి మీద కంటే బంగారం పై పెట్టుబడి పెడితే మంచిదా..?