Mumbai Billionaire: ముంబై లోకల్ ట్రైన్ లక్షలాది మంది ప్రజలకు జీవనాధారంగా పరిగణించబడుతుంది. ఈ మహానగరంలో ప్రతిరోజు ప్రజలు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు ఉపయోగిస్తారు. అయితే ఒక కోటీశ్వరుడు (Mumbai Billionaire) లోకల్ ట్రైన్ లో ప్రయాణం చేస్తే చూసేవారికి ఆశ్చర్యం కలుగుతుంది. బిలియనీర్ నిరంజన్ హీరానందని ముంబైలో లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తూ కనిపించాడు. సమయాన్ని ఆదా చేసేందుకు ఇలా చేశాడని తెలుస్తోంది. 73 ఏళ్ల హీరానందానీ ముంబై నుంచి ఉల్హాస్నగర్ వెళ్లేందుకు లోకల్ రైలును ఉపయోగించారు. దాని వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు.
अरबपति कारोबारी निरंजन हीरानंदानी ने ‘समय बचाने और ट्रैफ़िक से बचने’ के लिए की मुंबई लोकल ट्रेन की सवारी. लोगों ने की तारीफ़, कहा ज़मीन से जुड़े हुए हैं हीरानंदानी!#NiranjanHiranandani #MumbaiLocal #Mumbai
अब Whatsapp पर भी फॉलो करें: https://t.co/vRx4BdebzM pic.twitter.com/LYjvfQbKzR
— editorji हिंदी (@editorjihindi) December 31, 2023
దీని వల్ల సమయం ఆదా అవుతుందని, ట్రాఫిక్ నుంచి ఉపశమనం లభించిందని వీడియోతో పాటు రాశాడు. అతని పోస్ట్ వైరల్ అయ్యింది. ప్రజలు రకరకాల కామెంట్లు చేయడం ప్రారంభించారు. కొందరు దీనిని స్ఫూర్తిదాయకమని పిలుస్తుంటే, మరికొందరు అపహాస్యం చేస్తున్నారు. వీడియోలో అతను లోకల్ రైలు రాక కోసం వేచి ఉన్నాడు. అతను ప్లాట్ఫారమ్ గుంపులో నిలబడి ఉన్నాడు. అతనితో పాటు అతని బృందంలోని కొంతమంది సభ్యులు కూడా వెంట ఉన్నారు.
Also Read: Massive Fire In Maharashtra: మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం
ఎంత ఆస్తి ఉంది..?
నిరంజన్ హీరానందని.. హీరానందని గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ (MD). అతనికి వేలకోట్ల రూపాయల వ్యాపారం ఉంది. ఈ కంపెనీ దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రాజెక్టులను కలిగి ఉంది. జూన్ 2021 నాటికి ఫోర్బ్స్ భారతదేశంలోని 100 మంది ధనవంతులలో నిరంజన్ హీరానందనిని చేర్చింది. అతని నికర విలువ సుమారు US$1.6 బిలియన్లు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రజా రవాణాను ప్రోత్సహించండి
ప్రజా రవాణాను ఉపయోగించడం అనేక విధాలుగా మంచిది. దీనివల్ల డబ్బు ఆదా అవడమే కాకుండా వాహనాలు తక్కువగా ఉపయోగించడం వల్ల ట్రాఫిక్ జామ్ల సమస్య కూడా తగ్గుతుంది. కాలుష్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంతకుముందు కూడా చాలా మంది ప్రసిద్ధ వ్యక్తులు లోకల్ రైలులో ప్రయాణించిన విషయం తెలిసిందే.