Sikkim Floods: సిక్కీంలో వరద బీభత్సం.. 50 మందికిపైగా దుర్మరణం

సిక్కీంలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది.

  • Written By:
  • Updated On - October 7, 2023 / 12:55 PM IST

Sikkim Floods: సిక్కీంలో వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని తీస్తా నది పరీవాహక ప్రాంతంలో 30కి పైగా మృతదేహాలను వెలికితీశారు. 22 మంది సైనికులు తప్పిపోయారని, వారిలో 7 మంది మృతదేహాలను వెలికి తీశారు. వరదల కారణంగా దాదాపు 50 మందికిపైగా చనిపోయారు. ఇప్పుడు కూడా గత నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 3 వేల మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. అయితే వాతావరణ పరిస్థితులు క్షీణించడం వల్ల ఎయిర్ రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం కలుగుతోంది. అయితే గత శుక్రవారం నుంచి ఎయిర్ ఫోర్స్ MI-17 హెలికాప్టర్లతో కార్యకలాపాలు నిర్వహించడానికి అనేక ప్రయత్నాలు చేసింది.

ఇది కాకుండా వరదల కారణంగా 1200కు పైగా ఇళ్లు దెబ్బతినగా, 13 వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ అధికారుల ప్రకారం ఇప్పటివరకు 2,413 మందిని వివిధ ప్రాంతాల నుండి సురక్షితంగా తరలించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 22 సహాయ శిబిరాల్లో 6,875 మంది తలదాచుకున్నారు.

ఈ విషయంపై, సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ రాష్ట్రంలోని ఆకస్మిక వరదలలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్‌గ్రేషియా మొత్తాన్ని మరియు తీసుకున్న ప్రతి వ్యక్తికి తక్షణ సహాయంగా రూ. 2,000 ఇచ్చారు. ఇప్పటి వరకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. నష్టం గురించి మేం ఖచ్చితమైన వివరాలను చెప్పలేం అని ఆయన అన్నారు.