స్వచ్చభారత్….ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ చేపట్టిన పథకాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిల్లో ఇది ఒకటి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే దిశగా ప్రారంభించిన ఈ పథకం…దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ పథకం అమలు పట్ల మోదీ సర్కార్ కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంది. ఈ పథకానికి మోదీ ఎంతగా ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పేందుకు ఆదివారం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.
దేశ రాజధాని ఢిల్లిలో 920కోట్లతో కేంద్ర ప్రభుత్వం ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ను కొత్తగా ఏర్పాటు చేసింది. దీన్ని ప్రారంభించేందుకు ఉదయం ప్రధాని మోదీ ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొత్త నిర్మాణాన్ని పరిశీలించేందుకు కారిడార్ లోకి వెళ్లిన మోదీ…అక్కడ కనిపించిన చిన్న చిన్న పెంకులను తీశారు. ఆ తర్వాత అటుగా నడుస్తుండగా…కారిడార్ గోడకు ఆనుకుని పడిపోయిన కూల్ డ్రింక్ బాటిల్ ను కూడా మోదీ తీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Truly inspirational!
This is how Swachh Bharat became a Jan Andolan.Humbling to see PM @narendramodi Ji bending down to pick up little scraps & pieces during the inauguration of the Pragati Maidan Integrated Transit Corridor today. @MoHUA_India @SwachhBharatGov @PIB_India pic.twitter.com/v4ix281dxq
— Hardeep Singh Puri (@HardeepSPuri) June 19, 2022