Anil Chauhan : భారత సైన్యంలో ఆధునిక సాంకేతికత అవసరం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్

ఆధునిక యుద్ధ రంగంలో ముందంజ వహించాలంటే, సైన్యం పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాల్సిందేనన్నారు. గతంలో ఉపయోగించిన ఆయుధాలు ఇప్పటి యుద్ధాలకు సరిపోవు. ఆధునిక యుద్ధం అనేది కేవలం శారీరక బలంపై కాకుండా, మేధా సామర్థ్యం, టెక్నాలజీ ఆధారంగా సాగుతుంది అని చెప్పారు.

Published By: HashtagU Telugu Desk
Modern Technology Is Modern technology is needed in the Indian Army: CDS General Anil Chauhan

Modern technology is needed in the Indian Army: CDS General Anil Chauhan

Anil Chauhan : సంప్రదాయ ఆయుధాలతో ఆధునిక యుద్ధాలను ఎదుర్కొనడం సాధ్యపడదని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. భారత సైన్యం తన వ్యూహాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునీకరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఒక కీలక రక్షణ సదస్సులో ఆయన మాట్లాడుతూ..ఆధునిక యుద్ధ రంగంలో ముందంజ వహించాలంటే, సైన్యం పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాల్సిందేనన్నారు. గతంలో ఉపయోగించిన ఆయుధాలు ఇప్పటి యుద్ధాలకు సరిపోవు. ఆధునిక యుద్ధం అనేది కేవలం శారీరక బలంపై కాకుండా, మేధా సామర్థ్యం, టెక్నాలజీ ఆధారంగా సాగుతుంది అని చెప్పారు. ఈ సందర్భంలో ఆయన ‘ఆపరేషన్ సిందూర్’ ఉదాహరణ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంలో ఆధునిక సాంకేతికత కీలక పాత్ర పోషించింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్ల ప్రాముఖ్యతను స్పష్టంగా తెలియజేసింది అని వివరించారు.

Read Also: Teenmaar Mallanna : ఫోన్ ట్యాపింగ్ కేసు.. తీన్మార్ మల్లన్నకు సిట్ నోటీసులు

ప్రస్తుతం యుద్ధ రంగంలో మూడు ప్రధాన అంశాలు మార్గదర్శక శక్తులుగా మారుతున్నాయని పేర్కొన్నారు. సైబర్ యుద్ధం, డ్రోన్ ఆధారిత దాడులు, మరియు ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యూహాలు. ఇవన్నీ కలిపి చూస్తే, భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో విజయం సాధించాలంటే, మనకు ఉన్న శాస్త్రీయ సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలి అని తెలిపారు. ఇందుకోసం భారత సైన్యం ఇప్పటికే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) సహకారంతో కీలక రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా డ్రోన్ వ్యవస్థలు, సైబర్ రక్షణ పద్ధతులపై దృష్టి పెట్టినట్లు ఆయన వెల్లడించారు. మన శత్రువులు సైతం ఆధునిక టెక్నాలజీపై ఎక్కువగా దృష్టిపెడుతున్నారు. అలాంటి సమయంలో మనం వెనుకబడకూడదు. ప్రతి యుద్ధం విజయం మన టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. ఆపరేషన్ సిందూర్ ఒక ఉదాహరణ మాత్రమే. భవిష్యత్తులో మన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. వాటిని అధిగమించాలంటే మరింత ముందుకు సాగాలి” అని అన్నారు.

అదనంగా, రక్షణ రంగంలో ప్రభుత్వ సహకారం, పరిశోధన సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరమని కూడా ఆయన పేర్కొన్నారు. సైన్యంలోని ప్రాధాన్య మార్పులు, సాంకేతిక ప్రగతికి అనుగుణంగా ఉండాలన్నదే ఆయన ఉద్దేశం. ఇటీవలి కాలంలో భారత రక్షణ శాఖ, డీఆర్డీవో అనేక ఆధునిక సాంకేతిక ప్రయోగాలను ప్రారంభించాయి. ఇవి దేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, స్వావలంబనను కూడా పెంపొందిస్తున్నాయి. ఈ పరిణామాలను జనరల్ చౌహాన్ ప్రశంసించారు. సమస్యలను గమనించి, తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మాత్రమే సైన్యం ప్రస్తుత యుద్ధసామర్థ్యానికి తగిన స్థాయికి చేరుకుంటుందని ఆయన నొక్కి చెప్పారు. రక్షణ బడ్జెట్‌లో సాంకేతిక అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కూడా ఆయన సూచించారు.

Read Also: Indiramma Houses Scheme Survey : మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే .. లబ్ధిదారుల్లో ఆందోళన

  Last Updated: 16 Jul 2025, 12:55 PM IST