Site icon HashtagU Telugu

Indian Climber Anurag Maloo: ప్రాణాలతో బయటపడిన భారతీయ పర్వతారోహకుడు అనురాగ్.. పరిస్థితి విషమం

Anurag Maloo

Resizeimagesize (1280 X 720) (6)

నేపాల్‌ (Nepal)లోని ప్రపంచంలోని పదవ ఎత్తైన శిఖరం అన్నపూర్ణ పర్వతాన్ని అధిరోహిస్తూ అదృశ్యమైన భారతీయ పర్వతారోహకుడు (Indian Climber) అనురాగ్ మాలు (Anurag Maloo) రెస్క్యూ ఆపరేషన్‌లో కనుగొన్నారు. రెస్క్యూ టీమ్ అతడిని గుర్తించిందని మాలు సోదరుడు చెప్పాడు. మాలు పరిస్థితి విషమంగా ఉంది. మాలు సోమవారం లోతైన లోయలో పడినప్పటి నుంచి మాలు కోసం అధికారులు సెర్చింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.

సోమవారం తప్పిపోయిన అనురాగ్ మాలు అన్నపూర్ణ పర్వతం నుండి సజీవంగా రక్షించబడ్డాడు. ఇది సెవెన్ సమ్మిట్ ట్రెక్స్ ద్వారా ధృవీకరించబడింది. గత వారం నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం నుంచి దిగుతుండగా కనిపించకుండా పోయాడు. అనురాగ్ సోదరుడు సుధీర్ మాట్లాడుతూ.. “మాలు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించామని, మాలు బతికే ఉన్నాడని” తెలిపారు.

Also Read: Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

రాజస్థాన్‌లోని కిషన్‌గఢ్‌కు చెందిన మాలు (34) సోమవారం మూడో క్యాంపు నుంచి దిగుతుండగా దాదాపు 6,000 మీటర్ల ఎత్తు నుంచి కిందపడిపోయాడని అతని సోదరుడు సుధీర్ తెలిపారు. అన్నపూర్ణ పర్వతం ప్రపంచంలో 10వ ఎత్తైన పర్వతం. మాలు సజీవంగా ఉన్నాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ గోల్స్‌ను సాధించడానికి అవగాహన కల్పించడానికి, చర్యను నడపడానికి మొత్తం ఏడు ఖండాల్లోని మొత్తం 14 శిఖరాలు, 8,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఏడు పాయింట్లను అధిరోహించే లక్ష్యంతో మాలు ఉన్నారు.

అనురాగ్ అద్భుతమైన పర్వతారోహకుడు. అంతకు ముందు అతను చాలా పర్వతాలను అధిరోహించాడు. అతను REX కరమ్-వీర చక్రను పొందాడు. మాలు భారతదేశం నుండి 2041 అంటార్కిటిక్ యూత్ అంబాసిడర్ అయ్యాడు. మంగళవారం ఇద్దరు భారతీయ పర్వతారోహకులు బల్జీత్ కౌర్, అర్జున్ బాజ్‌పాయ్‌లు కూడా అన్నపూర్ణ పర్వత శిఖరం నుండి రక్షించబడ్డారు.