Military training : మహారాష్ట్ర విద్యారంగంలో సైనిక శిక్షణకు శ్రీకారం..చిన్నతనం నుంచే దేశభక్తికి బీజం

విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి ముఖ్యమైన విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణతో విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకునే అవగాహన కలుగుతుందని, ఇది భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Published By: HashtagU Telugu Desk
Military training begins in Maharashtra education sector.. Seeds of patriotism are planted from childhood

Military training begins in Maharashtra education sector.. Seeds of patriotism are planted from childhood

Military training : మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని పాఠశాలల్లో మొదటి తరగతి నుంచే విద్యార్థులకు బేసిక్ మిలిటరీ శిక్షణను అందించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దాదా భూసే మీడియాతో పంచుకున్నారు. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి ముఖ్యమైన విలువలు పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ శిక్షణతో విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో తెలుసుకునే అవగాహన కలుగుతుందని, ఇది భవిష్యత్తులో వారికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉగ్రదాడులు వంటి విపత్తుల సమయంలో సమర్థంగా స్పందించడానికి అవసరమైన ప్రాథమిక జ్ఞానాన్ని ఈ శిక్షణ ద్వారా విద్యార్థులకు అందిస్తామని తెలిపారు.

Read Also: Bangladesh: చైనాతో కలిసి పని చేస్తాం: మహమ్మద్ యూనస్

విద్యార్థులకు శిక్షణ ఇవ్వడంలో మాజీ సైనికుల సేవలను వినియోగించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో నియమించబడ్డ మాజీ సైనికులు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని భూసే వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రీడా ఉపాధ్యాయులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ), స్కౌట్స్, గైడ్స్ వంటి సంస్థల సహకారంతో పాటు సుమారు 2.5 లక్షల మంది రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని శిక్షకులుగా వినియోగించనున్నారు. ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ సానుకూలంగా స్పందించినట్టు భూసే వెల్లడించారు. విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ, బాధ్యతార్హత పెరగాలన్నదే ఈ కార్యక్రమం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు.

ఈ నిర్ణయం, ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తీసుకున్నదని ఆయన వివరించారు. ఏప్రిల్ 22న బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం పాక్‌పై దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. అంతేకాకుండా, ప్రజల్లో విపత్తుల సమయంలో సురక్షితంగా ఉండే చైతన్యాన్ని పెంచేందుకు దేశవ్యాప్తంగా 259 చోట్ల మాక్ డ్రిల్స్‌ నిర్వహించింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో మిలిటరీ శిక్షణ అవసరమని ప్రభుత్వం భావించింది. ఇది విద్యార్థుల భౌతిక స్థైర్యాన్ని మాత్రమే కాదు, మానసిక ధైర్యాన్ని కూడా పెంపొందించనుంది. ప్రస్తుత సామాజిక, భద్రతా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

Read Also: Microsoft : మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్‌లు.. 300 మంది తొలగింపు

 

  Last Updated: 03 Jun 2025, 01:02 PM IST