Most Powerful Women : ప్రముఖ అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫోర్బ్స్’ ఏటా ఇచ్చే ర్యాంకింగ్స్ ఎంతో ప్రతిష్టాత్మకమైనవి. ఈసారి 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో నలుగురు భారతీయ మహిళలకు చోటు దక్కింది. ఇందులో భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 32వ స్థానంలో నిలిచారు. హెచ్సీఎల్ కంపెనీ సీఈవో రోష్నీ నాదర్ మల్హోత్రా 60వ స్థానంలో ఉన్నారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) చైర్పర్సన్ సోమ మొండల్ 70వ స్థానం కైవసం చేసుకున్నారు. బయోకాన్ సంస్థ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా 76వ స్థానంలో ఉన్నారు. ఈజాబితాలో మొదటి స్థానంలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ తొలి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, నాలుగో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఐదో ప్లేస్లో అమెరికా గాయని టేలర్ స్విప్ట్ చోటు దక్కించుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.