Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్…నలుగురు నక్సల్స్ మృతి..!!

  • Written By:
  • Publish Date - November 26, 2022 / 08:22 PM IST

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ నలుగురు నక్సల్స్ మృతి చెందారు. నక్సల్స్ కు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో నలుగురిని కాల్చి చంపాయి భద్రతా దళాలు. 50 మంది నక్సల్స్ ఓ ప్రాంతంలో సమావేశం అయ్యారన్న పక్కా సమచారంతోనే కూంబింగ్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా దళాలపై నక్సల్స్ దాడికి పాల్పడినట్లు   బస్తర్ పోలీసు అధికారులు తెలిపారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ బీజాపూర్ ప్రాంతంలో నక్సల్స్ సమావేశం అయ్యారన్న సమాచారం అందడంతో ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు.

మిర్టూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొమ్రా గ్రామ సమీపంలోని అడవిలో ఈ ఎన్ కౌంటర్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. చనిపోయిన నలుగురు నక్సల్స్ ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. వారి వద్ద పెద్దెత్తున ఆయుధాలు లభించినట్లు ఐజీ తెలిపారు. వారి గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.