NEET PG Exams : ‘టైమ్ బౌండ్ సెక్షన్ ’ విధానాన్ని నీట్ పీజీ-2024 పరీక్షల్లో చేర్చాలని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ప్రకటించింది. నీట్ పీజీతో పాటు నీట్ ఎండీఎస్ , నీట్ ఎస్ఎస్, ఎఫ్ఎంజీఈ, డీఎన్బీ పీడీసీఈటీ , జీపీఏటీ, డీపీఈఈ , ఎఫ్డీఎస్టీ , ఎఫ్ఈటీ పరీక్షల్లో ఈ కొత్త మార్పు అమల్లోకి రానుంది. నీట్-పీజీ 2024 పరీక్ష జూన్ 23న జరగనున్న నేపథ్యంలో మనం ‘టైమ్ బౌండ్ సెక్షన్ ’ విధానం గురించి తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఇంటర్న్షిప్ కటాఫ్ను పొడిగించాలంటూ ఆంధ్రప్రదేశ్కు చెందిన రిధేశ్ అనే విద్యార్ధి వేసిన పిటిషన్పై విచారణకు సుప్రీం కోర్టు ధర్మాసనం ఇటీవల నిరాకరించింది. కటాఫ్ను పొడిగించలేమని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై సంబంధిత అధికారులను సంప్రదించవచ్చని అనుమతిస్తూ ధర్మాసనం పిటిషనర్కు సూచించింది. కాగా, ఈ ఏడాది నీట్-పీజీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఆగస్టు 15వ తేదీని ఇంటర్న్షిప్ కటాఫ్ తేదీగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.